నగదు రవాణా చేసే ట్రక్కు అదుపు తప్పి బస్సును ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇరవై మంది దుర్మరణం చెందారని దక్షిణాఫ్రికా ప్రభుత్వం తెలిపింది.
జోహన్నెస్బర్గ్ : దక్షిణాఫ్రికాలో సాయుధ ట్రక్కు, బస్సును ఢీ కొట్టడంతో జరిగిన ప్రమాదంలో 20 మంది మరణించారు. మరో 60 మంది గాయపడినట్లు లింపోపో ప్రావిన్స్ రవాణా విభాగం మంగళవారం తెలిపింది.
సోమవారం "నగదు రవాణా చేసే ట్రక్కు అదుపు తప్పి ఎదురుగా వెళ్తున్న బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇరవై మంది మరణించారు" అని డిపార్ట్మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది.
మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీలో కాల్పుల కలకలం: ముగ్గురు మృతి, ఐదుగురికి గాయాలు
ఇదిలా ఉండగా, పాకిస్తాన్ లో ఫిబ్రవరి 8న ఇలాంటి యాక్సిడెంట్ లో 30మంది మరణించారు. ఓ బస్సు, కారు ఒకదానికొకటి ఢీ కొని లోతైన లోయలోకి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులు మృతి చెందగా, మరో 15 మంది గాయపడినట్లు జియో న్యూస్ తెలిపింది. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కోహిస్థాన్ జిల్లాలోని కారకోరం హైవేపై మంగళవారం రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో లోయలోకి పడిపోయాయి.
జియో న్యూస్ రిపోర్ట్ ప్రకారం, ప్రావిన్స్లోని షిటియాల్ ప్రాంతంలో ఎదురుగా వస్తున్న కారును గిల్గిట్ నుండి రావల్పిండికి ప్రయాణీకులతో వస్తున్న బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పోలీసులు క్షతగాత్రులను, మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.
చీకటి కారణంగా రెస్క్యూ ఆపరేషన్లో రెస్క్యూ టీమ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అధికారులు తెలిపారు. బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి పాకిస్థాన్ అధ్యక్షుడు డాక్టర్ ఆరిఫ్ అల్వీ సంతాపం తెలిపారు. ఈ విషాద ఘటనలో మృతి చెందిన వారి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
గిల్గిత్ బాల్టిస్థాన్లోని చిల్లాస్ సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినందుకు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కోహిస్థాన్లో జరిగిన బస్సు ప్రమాదంపై గిల్గిత్ బాల్టిస్థాన్ ముఖ్యమంత్రి సంతాపం వ్యక్తం చేశారు.
జియో న్యూస్ నివేదిక ప్రకారం, ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి గాయపడిన వారిని తరలించి వారికి వైద్య సదుపాయాలు అందించాలని ఖలీద్ ఖుర్షీద్ అన్ని సంబంధిత విభాగాలను ఆదేశించారు. మెరుగైన సమన్వయం, అత్యవసర ప్రతిస్పందన పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ను రూపొందించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
కాగా, జనవరి 29న పాకిస్థాన్లోని బలూచిస్థాన్లో ప్రయాణీకుల కోచ్ లోయలో పడి 41 మంది మరణించారని డాన్ నివేదించింది. ఈ ఘటన బలూచిస్థాన్లోని లాస్బెలా జిల్లాలో చోటుచేసుకుంది. డాన్ నివేదిక ప్రకారం క్వెట్టా నుంచి కరాచీకి 48 మంది ప్రయాణికులతో వాహనం వెళుతోందని లాస్బెలా అసిస్టెంట్ కమిషనర్ హంజా అంజుమ్ తెలిపారు.
లాస్బెలా సమీపంలోని వంతెన పిల్లర్ను వాహనం ఢీకొట్టిందని, ఆ తర్వాత లోయలో పడి మంటలు అంటుకున్నాయని ఆయన చెప్పారు. "అతివేగం కారణంగా, లాస్బెలా సమీపంలో యు-టర్న్ తీసుకుంటుండగా కోచ్ వంతెన పిల్లర్ను ఢీకొట్టింది. ఆ తర్వాత వాహనం లోయలో పడి మంటలు చెలరేగాయి" అని హమ్జా అంజుమ్ చెప్పినట్లు డాన్ పేర్కొంది.
