ఓ ధనిక వ్యాపారి తనను తాను మళ్లీ యవ్వనంలోకి తీసుకువెళ్లాలని అనుకున్నాడు. అంతే రూ.16కోట్లు ఖర్చు చేసి.. చికిత్స చేయించుకున్నాడు

నిత్యం యవ్వంగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. అయితే.... అది ఎవరికీ సాధ్యం కాదు. వయసు పెరిగే కొద్ది.... వృద్ధాప్యం రావడం సహజం. అయితే.... ప్రస్తుతం టెక్నాలజీ, సైన్స్ బాగా డెవలప్ అయ్యింది. సాధ్యం కావు అనుకున్నవి కూడా సుసాధ్యం చేయగలుగుతున్నారు. అందుకే.... ఓ ధనిక వ్యాపారి తనను తాను మళ్లీ యవ్వనంలోకి తీసుకువెళ్లాలని అనుకున్నాడు. అంతే రూ.16కోట్లు ఖర్చు చేసి.. చికిత్స చేయించుకున్నాడు. ఈ సంఘటన కాలిఫోర్నియాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కాలిఫోర్నియా కి చెందిన జాన్సన్ అనే 45ఏళ్ల వ్యాపారికి విపరీతమైన డబ్బు ఉంది. ఆ డబ్బు ఖర్చు చేసి ఈ వయసులో తనను తాను 18ఏళ్ల యువకుడిలా మార్చుకోవాలని అనుకున్నాడు. అంతే.. అందుకోసం రూ.2మిలియన్ డాలర్లు.. మన కరెన్సీలో రూ.16కోట్లు ఖర్చు చేశాడు.

ప్రస్తుతం అతనిని 30 మంది వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కేవలం రూపు మాత్రమే కాదు... తన శరీరంలోని అన్ని అవయవాలు.. యవ్వనంలో ఎలా పని చేస్తాయో అలా చికిత్స చేయించుకుంటుండటం విశేషం.