కుప్పకూలిన విమానం: తొమ్మిది మంది మృతి
దక్షిణ డకోటాలో ఓ విమానం కుప్పకూలిన ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు.
చంబర్లీన్: దక్షిణ డకోటాలో ఓ విమానం కుప్పకూలిన ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు.
శనివారం మధ్యాహ్నాం పన్నెండున్నర గంటలకు విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 9మంది మృతి చెందారు.ఈ ఘటన సియోక్స్ జలపాతానికి 225.3 కి.మీ దూరంలో ఈ ఘటన చోటు చేసుకొంది.
దక్షిణ మధ్య దక్షిణ డకోటా వాతావరణ శాఖ శీతాకాలపు గాలులు వీస్తాయని హెచ్చరించిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొందని మీడియా కథనాలు వెలువడ్డాయి.ఈ ఘటనపై ఎన్టీఎస్బీ ఇన్వేస్టిగేటర్లు విచారణ చేయనున్నట్టుగా అధికారులు ప్రకటించారు.