Asianet News TeluguAsianet News Telugu

న్యూజిలాండ్‌లో కాల్పులు: 40కి చేరిన మృతుల సంఖ్య

న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ నగరంలో మసీదులో చోటు చేసుకున్న కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య 40కి చేరింది. శుక్రవారం కావడంతో మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని పోలీసులు తెలిపారు. 

40 killed in Christchurch mosque shootings
Author
Christchurch, First Published Mar 15, 2019, 12:46 PM IST

న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ నగరంలో మసీదులో చోటు చేసుకున్న కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య 40కి చేరింది. శుక్రవారం కావడంతో మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని పోలీసులు తెలిపారు.

నల్లరంగు దుస్తులు ధరించిన ఓ సాయుధుడు అల్ నూర్ మసీదులోకి చొరబడి ప్రార్థనలు జరుపుతున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తొలుత నలుగురు మరణించినట్లు వార్తలు వచ్చినప్పటికీ.. సహాయకచర్యల్లో మృతదేహాలు బయటపడుతున్నాయి.

దాడి సమయంలో మసీదులో సుమారు 300 వరకు ఉన్నట్లు సమాచారం. మరోవైపు కాల్పులకు తెగబడ్డ వ్యక్తి ఈ దాడినంతా లైవ్ స్ట్రీమింగ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని ఆస్ట్రేలియాకు చెందిన బ్రెంటన్ టారెంట్‌గా గుర్తించారు. ఇతని కోసం న్యూజిలాండ్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios