పాకిస్తాన్ లో బాంబు పేలుడు చోటు చేసుకొంది.ఈ ఘటనలో 30 మంది మరణించారు. పెషావర్ రిసల్దార్ మసీదులో బాంబు పేలిందని స్థానిక మీడియా ప్రకటించింది.
ఇస్లామాబాద్: పాకిస్తాన్ లోని Peshawar లోRisaldar లో గల mosque లో శుక్రవారం నాుడ జరిగిన బాంబు పేలుడులో 30 మంది మరణించారు. ఈ మేరకు స్థానిక మీడియా ప్రకటించింది.
మసీదు వద్ద నమాజ్ చేసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చిన స.మయంలో ఈ పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో 30 మంది అక్కడికక్కడే మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ విషయాన్ని స్థానిక పోలీస్ అధికారి వహీద్ ఖాన్ చెప్పారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మసీదులో నమాజ్ చేసేందుకు తాను వెళ్తున్న సమయంలో భారీ శబ్దంతో పేలుడు చోటు చేసుకొందని షాయన్ హైదర్ అనే వ్యక్తి చెప్పారు. ఈ పేలుడు ధాటికి తాను మసీదు బయట పడ్డానని మీడియాకు తెలిపారు. తాను ఈ ధాటికి స్పృహా కోల్పోయాయని ఆయన చెప్పారు. అయితే తాను స్పృహలోకి వచ్చిన తర్వాత తన చుట్టూ క్షతగాత్రులతో పాటు మృతదేహలు కన్పించాయని ఆయన వివరించారు.
ఈ బాంబు దాడిని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా ఖండించారు.
