Asianet News TeluguAsianet News Telugu

జపాన్‌లో 155 భూకంపాలు.. మంగళవారం ఉదయం మరో 6 వరుస భూకంపాలు, 8 మంది మృతి..

చాలా భూకంపాలు 3 కంటే ఎక్కువ తీవ్రతకలిగినవే. వీటి బలం క్రమంగా మోడరేట్ అయినప్పటికీ, మంగళవారం ఉదయం ఆరు బలమైన భూకంపాలు వచ్చినట్లు తేలింది. 

155 earthquakes in Japan,  6 consecutive earthquakes on Tuesday morning, 8 died - bsb
Author
First Published Jan 2, 2024, 8:34 AM IST

టోక్యో : కొత్త సంవత్సరం వేళ జపాన్ అతలాకుతలం అవుతోంది. సోమవారం నుంచి వరుస భూకంపాలు కుదిపేస్తున్నాయి. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు 155 భూకంపాలు సంభవించాయని, ఇందులో 7.6 తీవ్రతతో పాటు మరో 6కు పైగా భూకంపాలు మంగళవారం ఉదయం సంభవించాయని జపాన్ వాతావరణ కార్యాలయం తెలిపింది. చాలా భూకంపాలు 3 కంటే ఎక్కువ తీవ్రతను కలిగి ఉన్నాయి. బలం క్రమంగా మోడరేట్ అయినప్పటికీ, మంగళవారం ప్రారంభంలో ఆరు బలమైన కుదుపులు ఏర్పడ్డట్లు తెలిపింది.

న్యూ ఇయర్ రోజున సెంట్రల్ జపాన్‌ను తాకిన పెద్ద భూకంపంలో కనీసం ఎనిమిది మంది మరణించారు. ఈ భూకంపం ఒక మీటర్ ఎత్తుకు పైగా సునామీ తరంగాలు ఎగిసిపడ్డాయి. ఇళ్లు ధ్వంసం అయ్యాయి. పెద్ద అగ్నిప్రమాదం రాత్రిపూట విధ్వంసం సృష్టించిందని అధికారులు మంగళవారం తెలిపారు.

సోమవారం నాటి భూకంపం నుండి సంభవించిన నష్టం స్థాయి ఇంకా వెలువడుతూనే ఉంది. కూలిపోయిన భవనాలు, ఓడరేవు వద్ద మునిగిపోయిన పడవలు, లెక్కలేనన్ని కాలిపోయిన గృహాలు, రాత్రిపూట ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయికి పడిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారని వార్తా కథనాలు వెలువడ్డాయి. 

Tsunami: జపాన్‌ను తాకుతున్న సునామీ అలలు.. ఎత్తైన ప్రాంతాలకు పరుగెత్తాలని ఆదేశాలు

హోన్షు ప్రధాన ద్వీపంలోని ఇషికావా ప్రిఫెక్చర్‌లో సంభవించిన భూకంపం తీవ్రత 7.5గా ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) తెలిపింది. జపాన్ అధికారులు దీనిని 7.6 అని తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున 1:00 గంటలకు (1600 GMT సోమవారం) ఈ ప్రాంతంలో వచ్చిన 90 కంటే ఎక్కువ భూకంపాలలో ఇది ఒకటని తెలిపారు.

సోమవారం కనీసం 1.2 మీటర్లు (నాలుగు అడుగులు) ఎత్తైన అలలు వాజిమా నౌకాశ్రయాన్ని తాకాయి. అక్కడక్కడా చిన్న చిన్న సునామీలు వచ్చినట్టుగా కనిపించినా,  రాకాసి అలల హెచ్చరికలు కనిపించలేదు 
ఏరియల్ న్యూస్ ఫుటేజీలో సుజు ఫిషింగ్ పోర్ట్ వద్ద మునిగిపోయిన పడవలు, ఒడ్డుకు కొట్టుకుపోవడం కనిపించాయి.  వాజిమాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం విధ్వంసాన్ని చూపించాయి.

ఈ ప్రాంతంలోని సుమారు 32,700 గృహాలకు మంగళవారం విద్యుత్ సరఫరా లేదు. క్యోడో ఉదహరించిన అగ్నిమాపక, విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం, పదివేల మంది ప్రజలను ఖాళీ చేయమని ఆదేశించారు. దాదాపు 1,000 మంది సైనిక స్థావరాల్లో ఉంటున్నారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. "అందుబాటులో ఉన్న మార్గాలను ఉపయోగించడం ద్వారా వీలైనంత త్వరగా ఆ ప్రాంతానికి చేరుకోవాలని (అత్యవసర కార్మికులు) ఆదేశించాను" అని విపత్తు ప్రతిస్పందన సమావేశం తర్వాత ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా సోమవారం ఆలస్యంగా చెప్పారు.

"ఇప్పుడు చాలా చలిగా ఉంది. విమానాలు లేదా నౌకల ద్వారా నీరు, ఆహారం, దుప్పట్లు, హీటింగ్ ఆయిల్, గ్యాసోలిన్, ఫ్యూయల్ ఆయిల్ వంటి అవసరమైన సామాగ్రిని అందించాలని సూచనలు జారీ చేసాను" అని కిషిదా విలేకరులతో అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios