Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాదులో విషాదం: భవనంపై నుంచి కూతురితో సహా దూకి మహిళ ఆత్మహత్య

హైదరాబాదులోని రామంతపూర్ లో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన భర్తతో గొడవ పడి ఏడాది వయస్సు గల కూతురితో సహా భవనం నాలుగో అంతస్థు నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది.

Woman commits suicide in Hyderabad jumping from building along with her daughter
Author
Ramanthapur, First Published Aug 10, 2020, 6:12 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలోని రామంతపూర్ లో గల శ్రీనివాసపురంలో ఓ మహిళ తన ఏడాది వయస్సు గల కూతురితో భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. 

మృతురాలిని మేరీ మార్టిన్ గా గుర్తించారు. భర్తతో గొడవ పడి ఆమె ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. భవనం నాలుగో అంతస్థు నుంచి ఆమె కిందికి దూకింది. మహిళతో పాటు ఆమె కూతురు కూడా ఈ ఘటనలో మరణించింది. మృతదేహాలను పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు అందాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios