Asianet News TeluguAsianet News Telugu

దిశ సంఘటనకు నేటికి ఏడాది.. గుర్తొస్తే.. గుండెలు మెలిపెడుతుంది...

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ సంఘటన జరిగి నేటికి యేడాది పూర్తయ్యింది. ఓ అమ్మాయిని అత్యంత పాశవికంగా, సామూహిక అత్యాచారం చేసి, హత్య చేసిన సంఘటన ప్రతొక్కరినీ కదిలించింది. చివరికి నిందితుల ఎన్ కౌంటర్ తో ఈ ఘటనలో బాధితురాలికి చనిపోయిన తరువాత న్యాయం దక్కింది. 

Hyderabad Rape Case : Shadnagar Disha Incident Completed One Year - bsb
Author
Hyderabad, First Published Nov 27, 2020, 1:55 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ సంఘటన జరిగి నేటికి యేడాది పూర్తయ్యింది. ఓ అమ్మాయిని అత్యంత పాశవికంగా, సామూహిక అత్యాచారం చేసి, హత్య చేసిన సంఘటన ప్రతొక్కరినీ కదిలించింది. చివరికి నిందితుల ఎన్ కౌంటర్ తో ఈ ఘటనలో బాధితురాలికి చనిపోయిన తరువాత న్యాయం దక్కింది. 

2019 నవంబర్‌ 27 రాత్రి  8.30 గంటలకు శంషాబాద్ పరిధిలోని తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద జాతీయ రహదారి పక్కన ఈ ఘటన జరిగింది. స్కూటీ పంక్చర్ చేసి దిశను దారిమళ్లించారు నలుగురు నిందితులు. ఆమెను బలవంతంగా ఓ పాడు పడిన ప్రహరి పక్కకు తీసుకెళ్ళి దారుణంగా సామూహిక అత్యాచారం జరిపారు. ఈ ఘటనలో ఆమె చనిపోగా, విగత జీవిగా పడి ఉన్న ఆమెను అర్ధర్రాతి లారీలో తీసుకెళ్ళి షాద్‌నగర్‌ శివారులోని చటాన్‌పల్లి బైపాస్‌ వంతెన కింద దహనం చేశారు. 

డిసెంబర్‌ 28న  తెల్లవారే సరికి దిశ పట్ల జరిగిన దారుణం హైదరాబాద్ ను వణికించింది. తనకు భయమేస్తుందని చెల్లికి ఫోన్ చేసి మాట్లాడిన దిశ ఆడియో విన్న ప్రతొక్కరినీ కన్నీరు పెట్టించింది. ఆ రోజు రాత్రే నిందితులు ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఆ తరువాత దిశ హత్యకేసు ఎన్నో మలుపులు తిరిగింది. నవంబర్‌ 29న నిందితులను పోలీసులు షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకరావడంతో ఇక్కడే వారిని ఎన్‌కౌంటర్‌ చేయాలని వేలాది మంది జనం పోలీస్‌స్టేషన్‌ ముందు ధర్నా చేశారు. పోలీసుల పైకి ఆందోళన కారులు రాళ్లురువ్వడం, చెప్పులు విసరడంతో లాఠీ చార్జీ జరిగింది. అదేరోజు నిందితులను తహిసీల్దార్‌ ఎదుట హాజరు పర్చారు. దీంతో 14రోజుల పాటు రిమాండ్‌ విధించడంతో పోలీసులు నిందితులను భారీ బందోబస్తు మధ్య షాద్‌నగర్‌ నుండి చర్లపల్లి జైలుకు తరలించారు. 

డిసెంబర్‌ 6వ తేదీ తెల్లవారు జామున  నలుగురు నిందితులను సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం పోలీసులు చటాన్‌పల్లి బ్రిడ్జి వద్దకు తీసుకొచ్చారు. ఇక్కడ నిందితులు పోలీసుల పైకి తిరగబడటంతో పోలీసులు వారిని ఎన్‌కౌంటర్‌ చేశారు. నలుగురు నిందితులు ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు.

డిసెంబర్‌ 7న ఢిల్లీ నుండి మానవహక్కుల కమీషన్‌ బృందం దిశను ఆహుతి చేసిన ప్రాంతాన్ని, నిందితులు ఎన్‌కౌంటర్‌ జరిగిన స్ధలాన్ని పరిశీలించారు. డిసెంబర్‌ 9న నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన ప్రదేశాన్ని క్లూస్‌టీం 3డీ స్కానర్‌తో చిత్రీకరించింది. 

డిసెంబర్‌ 23న ఎన్‌కౌంటర్‌కు గురైన మృతదేహాలకు హైకోర్టు ఆదేశాల నేపధ్యంలో రీపోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎన్‌కౌంటర్‌కు గురైన మృతుల కుటుంబ సభ్యులు న్యాయం కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో కోర్టు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి వీఎస్‌ సిర్పూకర్‌ సీబీఐ మాజీ డైరక్టర్‌ కార్తీకేయన్, వీఎన్‌ బాంబే హైకోర్టు మాజీ జడ్జి రేఖలతో  త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయగా కమిటీ సభ్యులు విచారణ నిమిత్తం గత జనవరిలో హైదరాబాద్‌కు వచ్చారు.

దిశ ఘటన తరువాత మహిళల రక్షణలో భాగంగా చట్టాలను కఠినతరం చేశారు. ఉద్యోగ రిత్యా బయటికి వెళ్లే మహిళల స్వీయ రక్షణ కోసం యాప్‌లు ఏర్పాటు చేయడం, కళాశాలల్లో మహిళా రక్షణ దిశగా వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారిలో చైతన్యం తీసుకురావడం మహిళల నుండి పిర్యాదులు వస్తే వెంటనే స్వీకరించడం, వెంటనే దర్యాప్తు ప్రారంభించడం వంటి కార్యక్రమాలను విసృతం చేశారు. పోలీసు పెట్రోలింగ్‌లో సైతం వేగం పెంచారు.

Follow Us:
Download App:
  • android
  • ios