Asianet News TeluguAsianet News Telugu

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోర కారు ప్రమాదం

హైదరాబాద్ లోని దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేబుల్‌  బ్రిడ్జిపై వెళ్తున్న కారు టైర్‌ బ్లాస్ట్‌ కావడంతో పల్టీ కొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. 

Car Accident at Durgam Cheruvu Cable Bridge in Hyderabad - bsb
Author
Hyderabad, First Published Nov 5, 2020, 3:48 PM IST

హైదరాబాద్ లోని దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేబుల్‌  బ్రిడ్జిపై వెళ్తున్న కారు టైర్‌ బ్లాస్ట్‌ కావడంతో పల్టీ కొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. 

కారులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వేగంగా వస్తున్న కారు  అదుపుతప్పి డివైడర్ గోడను ఢీకొనడంతో టైర్ పేలిపోయింది. కారు బోల్తా పడగానే అదే మార్గంలో వెళ్తున్న వాహనదారులు స్పందించి కారులో చిక్కుకున్న వారిని బయటకు లాగారు. 

సమాచారం అందుకున్న పోలీసులు కూడా హుటాహుటినా సంఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గురైన కారును తిరిగి పైకి లేపారు. కారులోని వ్యక్తులంతా క్షేమంగా బయటపడ్డారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ సమయంలో వాహనాల రద్దీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దేశంలోనే అతిపెద్ద కేబుల్‌ బ్రిడ్జి అయిన దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జిని సెప్టెంబర్‌ 25న మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. లాక్‌డౌన్‌ కాలంలో ఇంటికే పరిమితమైన చాలామందికి దుర్గంచెరువు మంచి పర్యటక కేంద్రంగా మారింది. 

Follow Us:
Download App:
  • android
  • ios