Asianet News TeluguAsianet News Telugu

మతి స్థిమితం ఉన్నట్లు లేదు: బండి సంజయ్ మీద కేటీఆర్

నిజాం క్లబ్ లో జరిగిన విశ్వానగరంగా  హైదరాబాద్ సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. హైదరాబాద్ కు అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులు, అంతర్జాతీయ స్థాయిలో ఆకట్టుకున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, కమాండ్ కంట్రోల్ రూమ్, మెట్రో రైల్ తదితర పలు అంశాలపై చర్చించారు. 

An exclusive interaction with Minister KTR on Transforming Hyderabad into a Global City on Thursday at Nizam Club - bsb
Author
Hyderabad, First Published Nov 26, 2020, 2:04 PM IST

నిజాం క్లబ్ లో జరిగిన విశ్వానగరంగా  హైదరాబాద్ సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. హైదరాబాద్ కు అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులు, అంతర్జాతీయ స్థాయిలో ఆకట్టుకున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, కమాండ్ కంట్రోల్ రూమ్, మెట్రో రైల్ తదితర పలు అంశాలపై చర్చించారు. 

మంత్రి కేటీఆర్ మట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అనేక కార్యక్రమాలు చెప్పాట్టామని, తెలంగాణ రాష్ట్రం గురించి చర్చించుకోవాడినికి 100 గంటలైనా సరిపోదని అన్నారు. తెలంగాణ వస్తే తెలంగాణ వారికి పాలన చేయరాదు అని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హేళన చేసి మాట్లాడాడని, ఇప్పుడీ అభివృద్ధి చూస్తే ఏం మాట్లాడతారని ప్రశ్నించారు. 

ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ నగరం కు ప్రత్యేకత ఉందని, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, కమాండ్ కంట్రోల్  హైదరాబాద్ నగరంలో కొత్త కట్టడాలని చెప్పుకొచ్చారు. వ్యవసాయ శాఖ కోసం సీఎం కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని, పండించిన పంటకు మద్దతు ధర ఇస్తున్నారని అన్నారు. 

ఇందిరా పార్కులో గత ప్రభుత్వాల హయాంలో రకరకా సమస్యల మీద పరిశ్రమల అధినేతలు ధర్నాలు జరిగేవని, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు.  ఇప్పుడు పరిశ్రమలకు 24 గంటల కరెంట్ సప్లై జరుగుతుందని, 7000 వేల మెగా వాట్ల డిమాండ్స్ నుండి 16 వేల మెగా వాట్స్ డిమాండ్ కు వచ్చామన్నారు.

4000 వేల మెగా వాట్స్ సోలార్ విద్యుత్ ను ఉత్పత్తి చేస్తూ దేశములో లొనే సోలార్ విద్యుత్ ఉత్పత్తి లో 2 వ స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు.  ఒకప్పుడు హైదరాబాద్ లో త్రాగు నీటి సమస్య ఉండేది ఇప్పుడు 96 శాతం సమస్య పరిష్కరం అయిందని రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో సప్లై చేస్తాన్నారు.

హైదరాబాద్ వాసుల దాహార్తిని తీర్చేందుకు ఒక్క గండి పేట్ రిజర్వాయర్ ఉండేది. 100 సంవత్సరాలు అయిన ఒక్కటే ఉంది కాని తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేశవ పురం రిజర్వాయర్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. రోజు నీటి సప్లై చేయడానికి సీఎం కేసీఆర్ ఈ రిజర్వాయర్ ఏర్పాటు చేస్తున్నాడు.

హైదరాబాద్ నగరంలో రోడ్ల సమస్య ఉండేది కానీ 6 ఏండ్లలో అనేక రోడ్ల నిర్మాణం చెప్పాట్టం ఇంకా చేయాల్సింది ఉంది.పెద్ద పెద్ద ఐటీ కంపెనీ లు వాటి ప్రధాన కార్యాలయాలు ఇక్కడే  ఏర్పాటు చేశాయన్నారు. పరిశ్రమ నిర్మణం కోసం టిఎస్ ఐపాస్ తీసుకువచ్చాము. 

గతంలో హైదరాబాద్ నగరంలో కర్ఫ్యూ ఉండేదని, తాను నిజాం కాలేజ్ లో చదివిన రోజుల్లో  కర్ఫ్యూ తో సెలవులు ప్రకటించేవారని గుర్తు చేసుకున్నారు. 6 ఏండ్లలో శాంతి భద్రతల విషయంలో సీఎం కేసీఆర్ అనేక సంస్కరరణలు తెచ్చారన్నారు.

హైదరాబాద్ లో 5లక్షల సిసి కెమెరా లు ఏర్పాటు చేశాం. చిన్న చిన్న గల్లీ లలో కూడా సిసి కేమెరా లు ఏర్పాటు చేశాం దీనితో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగడం లేదన్నారు. 


కేంద్రంలో కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు 6 ఏండ్లలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాము మీరు ఎం చేశారో చెప్పండి కిషన్ అన్న  మేము గడిసిన ఆరు ఏండ్లలో చేసినవి చూపిస్తాం మీరు చూపిస్తారా అని ప్రశ్నించారు. 

గడిచిన ఆరు ఏండ్లలో 2 లక్షల 72 వేల కోట్ల టాక్సీ కేంద్రానికి కట్టాం మీరు ఇచ్చింది ఎంత ఒక్క లక్ష 42 వేలు మాత్రమే ఇచ్చారు. రోహింగ్యాలు ఉన్నారు హైదరాబాద్ లో అంటున్నారు బీజేపీ కేంద్ర మంత్రులు. ఆరేళ్లుగా ఎటు పోయారంటూ ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నది మీ ప్రభుత్వమే కదా ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. 

ఆధార్ కార్డ్ ,వీసా, పాస్ పోర్ట్ లు ఇచ్చేది కేంద్రమే కదా అప్పుడెలా ఇచ్చారని ప్రశ్నించారు. ఇక్కడ బీజేపీ అధ్యక్షుడు మానసికంగా కరెక్ట్ లేనట్టు ఉన్నాడు ట్రిపుల్ డ్రైవింగ్ చేయండి చాలన్ మేము కడుతాం అంటున్నాడని ఎద్దేవా చేశారు. గల్లీ పార్టీ మాది ఢిల్లీ పార్టీ వాళ్ళది ఢిల్లీ లో టూరిస్ట్ లు వస్తారు పోతారంటూ చురకలంటించారు. 

హైదరాబాద్ లో వరదలు వస్తే సాయం చేయమంటే ఒక్క రూపాయి ఇవ్వలేదని, సీఎం కేసీఆర్ లేఖ రాశినా స్పందించలేదన్నారు. అదే కర్ణాటక ప్రభుత్వం రాస్తే నాలుగు రోజుల్లో ఇచ్చారన్నారు. జరిగేవి లోకల్ ఎన్నికలు కానీ డిల్లీ ఉన్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎందుకు వస్తున్నారన్నారు.

జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోండి ఇంట్లో ఉండి కేసీఆర్ బాగా చేస్తున్నాడు అనడం కాదు బయటకు వచ్చి ఓటు  వేయండి మరోసారి టీఆరెస్ పార్టీ కి సపోర్ట్ చేయండి.
 

Follow Us:
Download App:
  • android
  • ios