Asianet News TeluguAsianet News Telugu

Vijay:పవన్ ఫ్లాఫ్ సినిమా స్టోరీ లైన్ తోనే 'వారసుడు' కథ?

 ఇప్పుడు 'వారసుడు' మూవీ కూడా ఇదే ప్లాట్ తో రాబోతోందని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి - అహిషోర్ సాల్మన్ కథ - స్క్రీన్ ప్లేను అందిస్తున్నారు.  ఇదిలా ఉంటే...  'వారసుడు' ఫస్ట్ లుక్ రాగానే  'మహర్షి 2' కాబోతోందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. నిజానికి 'మహర్షి' అనేది సక్సెస్ ఫుల్ మూవీ. జాతీయ అవార్డ్ కూడా సాధించింది. 

Vijay 'Varasudu' movie inspired from that flop movie?
Author
Chennai, First Published Jun 30, 2022, 12:19 PM IST


దళపతి విజయ్‌ ప్రస్తుతం తన 66వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తెలుగు దర్శకుడు  వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది.  విజయ్‌- వంశీల కలయికలో వస్తున్న చిత్రానికి వరిసు అన్న టైటిల్‌ను ఖరారు చేశారు. . తెలుగులో ఈ సినిమా వారసుడుగా రాబోతోంది ఇక ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్, యోగి బాబు, ప్రభు, జయసుధ, శ్రీకాంత్, సంగీత క్రిష్ తదితరులు నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2023 ఆరంభంలో విడుదల కానుంది. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ చిత్రం కథ  నేపథ్యం గురించి సోషల్ మీడియాలో ఓ ఇంట్రస్టింగ్  విషయం చక్కర్లు కొడుతోంది.

 అదేమిటంటే...పవన్ చేసిన 'అజ్ఞాతవాసి', ప్రభాస్ హీరోగా వచ్చిన 'సాహో' వంటి సినిమాలకు దగ్గరగా ఉండే కథాంశంతో "వారసుడు" చిత్రం రూపొందుతోందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన డిజాస్టర్ మూవీ 'అజ్ఞాతవాసి'. దీనిపై కాపీ ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇది ఫ్రెంచ్ చిత్రం 'లార్గో వించ్' కు అనఫీయల్ రీమేక్ గా అన్నారు. అప్పట్లో మేకర్స్ దీనిపై  లీగల్ చిక్కులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. దాదాపు అదే స్టోరీ లైన్ తో ప్రభాస్ హీరోగా 'సాహో' సినిమాని రూపొందించారు. సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ కూడా బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు.  ఇప్పుడు 'వారసుడు' మూవీ కూడా ఇదే ప్లాట్ తో రాబోతోందని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి - అహిషోర్ సాల్మన్ కథ - స్క్రీన్ ప్లేను అందిస్తున్నారు. 

Vijay 'Varasudu' movie inspired from that flop movie?

ఇదిలా ఉంటే...  'వారసుడు' ఫస్ట్ లుక్ రాగానే  'మహర్షి 2' కాబోతోందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. నిజానికి 'మహర్షి' అనేది సక్సెస్ ఫుల్ మూవీ. జాతీయ అవార్డ్ కూడా సాధించింది. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు సిల్వర్ జూబ్లీగా ఫ్యాన్స్ ఇలాంటి సినిమాని ఆశించలేదు. అందుకే వంశీని టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తుంటారు. ఇప్పుడు విజయ్ చిత్రంతో తన సత్తా ఏంటో చూపించాలని వంశీ తీవ్రంగా కష్టపడుతున్నట్లు చెప్తున్నారు.

'వారసుడు' సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రభు - శరత్ కుమార్ - ప్రకాష్ రాజ్ - జయసుధ - శ్రీకాంత్ - కిక్ శామ్ - యోగి బాబు - సంగీత - సంయుక్త షణ్ముగం తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. కార్తీక్ పలనీ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. పీవీపీ సినిమాస్ సహకారంతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు - శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2023 పొంగల్ కానుకగా 'వారసుడు' చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios