టాలీవుడ్ క్యూట్ క‌పుల్‌గా పేరు గాంచిన స‌మంత‌, నాగ‌చైత‌న్య విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించి అంద‌రినీ షాక్‌కు గురి చేశారు. త‌రువాత సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కుమార్తె ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్‌, ధ‌నుష్‌లు విడాకులు తీసుకున్నారు. ఇలా సెల‌బ్రిటీ క‌పుల్స్ చాలా మంది ఈ మ‌ధ్య కాలంలో విడాకులు తీసుకుంటున్నారు. ఇక త్వ‌ర‌లోనే మ‌రో టాలీవుడ్ జంట కూడా విడాకులు తీసుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది.

ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల  భార్య రూపా వైట్ల విడాకుల కోసం అప్లై చేసారంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమె నాంపల్లి కోర్టులో ఈ మేరకు డైవర్స్ కు ఫైల్ చేసారని చెప్పుకుంటున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా ఈ జంట విడిగా ఉంటున్నారని చెప్తున్నారు. వీరిద్దరి మధ్యన వచ్చిన అభిప్రాయ భేధాలు పెరిగి పెద్దవి అవటమే విడాకులుకు కారణంగా వినపడుతోంది. అయితే ఈ విషయమై అఫీషియల్ గా ప్రకటన అయితే లేదు. ఈ విషయమై నిజమేమిటో తెలియాల్సి ఉంది. 

ఇక  రూపా వైట్ల  ‘వేదిక్’ అనే బ్రాండ్ ద్వారా వ్యవసాయాధారిత సేంద్రీయ ఉత్పత్తుల వ్యాపారాన్ని ప్రారంభించారు. ఈ బ్రాడ్ ద్వారా తొలిత ఆవు పాలను విక్రయించనున్నట్లు ప్రకటనలో తెలిపారు. వివిధ కంపెనీలకు చెందిన విదేశీ బ్రాండ్‌లు చాలా అందుబాటులో ఉన్నప్పటికీ ఆర్గానిక్ ప్రొడక్ట్‌లకు డిమాండ్ చాలా ఉండటంతో ఈ రంగం వైపు మొగ్గుచూపారు. ''ఇది ఓ విధానం కాదు.. విప్లవం'' అంటూ వేదిక్ బ్రాండ్‌తో మార్కెట్‌లో తొలి అగుడు వేసారు ఆమె. 

కెరీర్ విషయానికి వస్తే..  శ్రీనువైట్ల కూడా ప్రస్తుతం పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవడం కోసం తన దర్శకత్వ ప్రతిభకు మెరుగులు అద్దే పనిలో ఉన్నారు.ఆనందం, వెంకీ, ఢీ, దుబాయ్ శీను, దూకుడు, బాద్ షా లాంటి బ్లాక్ బస్టర్ హిట్‌లతో టాప్ డైరెక్టర్ రేంజ్‌కి ఎదిగారు శ్రీనువైట్ల. అయితే  ఆ తరువాత వరుస ఫ్లాప్‌లతో బాగా వెనక పడ్డాడు. 

‘మిస్టర్’ సినిమాతో ఊహించని డిజాస్టర్ మూటకట్టుకున్న శ్రీను వైట్ల ప్రస్తుతం రవితేజ హీరోగా   ‘అమర్ అక్బర్ ఆంటోని’ అనే చిత్రం చేసారు. ఈ మూవీలో రవితేజ మూడు విభిన్న పాత్రల్లో నటించారు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం మంచు విష్ణుతో   ఢీ అండ్ ఢీ అనే టైటిల్ తో సినిమా చేస్తున్నారు.ఈ నేపధ్యంలో ఢీ సీక్వెల్ గా ఆ సినిమా ఉంటుందనే మాట వినిపించింది.కానీ అది నిజం కాదని చెప్పారు.