Asianet News TeluguAsianet News Telugu

బాలయ్యనే కాదు...క్రిష్ ని ఈ గాసిప్ లోకి లాగారే

ప్రస్తుతం గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో ఓ మాదిరి బడ్జెట్ సినిమాలను నిర్మించడంలో అల్లు అరవింద్ బిజీగా ఉన్నారు. అలాగే ఓటీటీ కంటెంట్ ను సెట్ చేసే పనుల్లో తీరిక లేకుండా ఉన్నారు. 

Geetha Arts-Balayya film loading soon?
Author
Hyderabad, First Published Nov 6, 2021, 2:55 PM IST

స్టార్ హీరో  బాలకృష్ణ వరుస ప్రాజెక్ట్ లతో దూసుకెళ్తున్నారు. బాలయ్య ప్రస్తుతం 'అఖండ' చేస్తుండగా.. గోపీచంద్​ మలినేని దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్​ సిగ్నల్ ఇచ్చారు. అయితే.. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్​లో బాలయ్య ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని క్రేజీ చిత్రాన్ని క్రిష్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. క్రిష్​.. బాలకృష్ణతో గౌతమిపుత్ర శాతకర్ణి, ఎన్​టీఆర్ కథానాయకుడు చిత్రాలు తీశారు. మరోసారి క్రిష్​, బాలకృష్ణ కలిస్తే మాత్రం  మంచి ఎక్సపెక్సటేషన్స్ ఉంటాయి! అయితే దీనిపై అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు. మరో ప్రక్క ఇది రూమర్ అని కొందరు కొట్టి పారేస్తున్నారు. బాలయ్య చేస్తున్న షో ని బేస్ చేసుకుని ఈ గాసిప్ రెడీ చేసారంటున్నారు.

 కర్టైన్ రైజర్ లో వేదికపై బాలకృష్ణ మాట్లాడుతూ, అల్లు ఫ్యామిలీతో తమకి గల అనుబంధాన్ని చెప్పడంతో, ఈ కాంబినేషన్లో సినిమా ఉంటుందనే ప్రచారం బలం పుంజుకుంటోంది. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో ఓ మాదిరి బడ్జెట్ సినిమాలను నిర్మించడంలో అల్లు అరవింద్ బిజీగా ఉన్నారు. అలాగే ఓటీటీ కంటెంట్ ను సెట్ చేసే పనుల్లో తీరిక లేకుండా ఉన్నారు. ఈ పనులు ఒక కొలిక్కి వచ్చాక బాలకృష్ణతో సినిమా మొదలవుతుందని గట్టిగానే చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి.

బాలయ్య ప్రస్తుతం 'అఖండ' చిత్రంలో నటిస్తున్నారు. బాలకృష్ణ- బోయపాటి కాంబినేషన్​లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఇంతకుముందు 'సింహా', 'లెజెండ్​' చిత్రాలతో బ్లాక్​బస్టర్​లు కొట్టిన వీరిద్దరూ.. ఇప్పుడు మూడో సినిమాతో తమ సత్తా చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా నటించింది. శ్రీకాంత్, పూర్ణ.. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతమందించారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు.గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు బాలయ్య. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది

Follow Us:
Download App:
  • android
  • ios