స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్, రాజకీయ ప్రముఖులు
ఇండిపెండెన్స్ డే సందర్బంగా దేశంలో సామాన్యుల నుండి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరు జాతియా జెండా ఆవిష్కరణలో పాల్గొంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు జాతీయ జెండాను గౌరవప్రదంగా ఎగరేవేసి దేశభక్తిని చాటుకున్నారు.
స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి అధికార నివాసం ప్రగతి భవన్ పై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు
73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను ఎగురవేసిన ఆబ్కారీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్,
కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ మన్నె శ్రీనివాస రెడ్డి, జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్, ఎస్పీ రెమా రాజేశ్వరి.
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జాతియా జెండాను ఆవిష్కరించిన చంద్రబాబు
వేడుకలో మరికొంత మంది సీనియర్ టిడిపి నేతలు కూడా పాల్గొన్నారు.
అరణ్యభవన్ లో ఇండిపెండెన్స్ డే ఉత్సవాల్లో పాల్గొన్న అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్. శోభ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రాంగణంలో (నేలపాడు) గురువారం యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పతాకావిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్ , ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు వైవి రవి ప్రసాద్, ఏపీ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఛైర్మన్ గంటా రామారావు, ఏపీ హైకోర్టు అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రమణ్యం లు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రసంగించారు
73వ స్వాతంత్య్ర దినోత్సవం భాగంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండా ఎగురవేసిన సీఎం జగన్
అనంతరం రాష్ట్రప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో కల్పించినా రాష్ట్రంలో రాజకీయ, ఆర్థిక అసమానతలు నేటికి కనిపిస్తూనే ఉన్నాయన్నారు.