సచివాలయ కూల్చివేత: కొత్త భవనాల నిర్మాణంపై వివరాలు కోరిన హైకోర్టు
సచివాలయం కూల్చివేతపై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ సాగింది. ఈ సందర్భంగా కొత్త సచివాలయ నిర్మాణంపై వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది.
సచివాలయం కూల్చివేతపై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ సాగింది. ఈ సందర్భంగా కొత్త సచివాలయ నిర్మాణంపై వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది.
సచివాలయం, అసెంబ్లీ భవనాలను కొత్తగా నిర్మించాలని కేసీఆర్ గతేడాది ఏడాది జూన్లో సంకల్పించారు. ఎర్రమంజిల్లోని చారిత్రక పాత భవనాలను కూల్చి, వాటి స్థానంలో అసెంబ్లీ, పాత సచివాలయాన్ని పడగొట్టి దాని స్థానంలో కొత్త సెక్రటేరియేట్ను నిర్మించాలని కేసీఆర్ నిర్ణయించారు.
దీనిలో భాగంగా గత ఏడాది జూన్ 27న భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీని నిమిత్తం సెక్రటేరియేట్ను ఖాళీ చేసి బీఆర్కే భవన్లోకి అన్ని శాఖలను మార్చారు. అయితే కొత్త భవనాల నిర్మాణానికి వ్యతిరేకంగా పలువురు హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం దీనిపై స్టే విధించింది.
ప్రస్తుతం ఉన్న సచివాలయ భవనం వివిధ ప్రమాణాలకు అనుగుణంగా లేదని, ఎన్నో సమస్యలు ఉన్నాయని అందువల్లే కూల్చివేయడానికి నిర్ణయించామని ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అయినప్పటికీ ప్రభుత్వానికి ఊరట లభించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎర్రమంజిల్ చారిత్రక భవనాలను కూల్చొద్దని, సచివాలయం కూల్చివేత విషయంలోనూ ఇదే ఆదేశాలు వర్తిస్తాయని చెప్పిన సంగతి తెలిసిందే.