MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Telangana
  • Telangana: విద్యార్థులకు సూపర్‌ న్యూస్‌ చెప్పిన సర్కార్‌...స్టైఫండ్‌ పెంచినట్లు ప్రకటన!

Telangana: విద్యార్థులకు సూపర్‌ న్యూస్‌ చెప్పిన సర్కార్‌...స్టైఫండ్‌ పెంచినట్లు ప్రకటన!

వైద్య విద్యార్థులకు స్టైఫండ్ 15% పెంపు, 16 వేల ఉద్యోగాల సర్వీసు ఏడాది పొడిగిస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. జూడాల డిమాండ్ల పై  కూడా ప్రభుత్వం స్పందించింది.

1 Min read
Author : Bhavana Thota
Published : Jun 30 2025, 10:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
స్టైఫండ్‌ను 15 శాతం
Image Credit : Gemini

స్టైఫండ్‌ను 15 శాతం

తెలంగాణ ప్రభుత్వం వైద్య విద్యార్థులకు, సీనియర్ రెసిడెంట్లకు ఆర్థిక ఊరటనిచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. మెడికల్, డెంటల్ విద్యార్థులకు ప్రతినెలా అందించే స్టైఫండ్‌ను 15 శాతం మేర పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది విద్యార్థులకు లబ్ధి కలుగనుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
 స్టైఫండ్ పెంపు
Image Credit : Gemini

స్టైఫండ్ పెంపు

ఇప్పటికే జూనియర్ డాక్టర్ల సంఘం (జూడా) గత కొన్ని వారాలుగా స్టైఫండ్ చెల్లింపుల ఆలస్యం, ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యలు, మెడికల్ కాలేజీల్లో సౌకర్యాల కొరత వంటి అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లింది. జూడా నేతలు జూన్ 30 నుంచి ధర్నా ప్రారంభిస్తామని హెచ్చరించడంతో, ప్రభుత్వం స్టైఫండ్ పెంపుతో సహా చర్యలు తీసుకుంది.

Related Articles

Related image1
Telangana: రేషన్ కార్డుదారులకు హెచ్చరిక… ఇంకా 3 రోజులే ఉంది.. !
Related image2
Telangana Rains : తెలుగు ప్రజలకు చల్లనికబురు ... ఉదయం నుండి రాత్రివరకు వర్షాలే వర్షాలు
36
మల్టీ టాస్కింగ్ స్టాఫ్
Image Credit : Freepik

మల్టీ టాస్కింగ్ స్టాఫ్

ఇంతే కాదు, రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న 16,448 మంది ఉద్యోగుల సర్వీసులను మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో 4,772 మంది కాంట్రాక్టు ఉద్యోగులు, 8,615 మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, 3,056 మంది గౌరవ వేతన ఉద్యోగులు ఉన్నారు. అలాగే ఐదుగురు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగుల సర్వీసులు కూడా పొడిగించారు. ఈ ఉత్తర్వులను ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా జారీ చేశారు.

46
ప్రభుత్వం పట్ల విశ్వాసం
Image Credit : AI Photo

ప్రభుత్వం పట్ల విశ్వాసం

ఈ పరిణామాల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ జూడా ప్రతినిధులతో చర్చలు జరిపారు. చర్చలకు ముందు స్టైఫండ్ పెంపు ఉత్తర్వులు విడుదల కావడం వల్ల జూడా సభ్యుల్లో ప్రభుత్వం పట్ల విశ్వాసం పెరిగింది.

56
మెడికల్ కాలేజీల సంఖ్య పెరగడంతో
Image Credit : Gemini

మెడికల్ కాలేజీల సంఖ్య పెరగడంతో

ప్రస్తుతం రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్య పెరగడంతో, విద్యార్థుల సంఖ్యతో పాటు సిబ్బంది అవసరం కూడా పెరిగింది. దీంతో ఉద్యోగాల పొడిగింపు నిర్ణయం వైద్య సేవల లోపల స్థిరత్వాన్ని తీసుకొస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

66
ప్రభుత్వ వైద్య రంగాన్ని
Image Credit : Gemini

ప్రభుత్వ వైద్య రంగాన్ని

వైద్య విద్యార్థులు, ఉద్యోగులు ప్రభుత్వ స్పందనపై హర్షం వ్యక్తం చేస్తూ, ఈ నిర్ణయాలు వైద్య రంగ అభివృద్ధికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా కీలకమైన ముందడుగు అయిందని వారు అభిప్రాయపడ్డారు.

About the Author

BT
Bhavana Thota
భావన మహిళా జర్నలిస్ట్. ఈమె 10 ఏళ్లుగా పాత్రికేయరంగంలో ఉన్నారు. స్థానిక వార్తలు మొదలుకుని అంతర్జాతీయ వార్తల దాకా ఏ అంశంపై అయినా సులభంగా అర్థం అయ్యేలా కథనాలు రాయగలగడం భావన ప్రత్యేకత. ఈమె ఈనాడులో దాదాపు ఆరేళ్లు పని చేశారు. తొలివెలుగు, ఆర్టీవీలోనూ ఈమె పలు కేటగిరీలకు సబ్ ఎడిటర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఆమె ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు.
తెలంగాణ
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Recommended image2
Onion and Sugar Prices: తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి చక్కెర మంట.. అసలు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
Recommended image3
మంత్రి పదవి నుంచి తొలగించండి.. కొండా సురేఖ విష‌యంలో షాకింగ్ నిర్ణ‌యం
Related Stories
Recommended image1
Telangana: రేషన్ కార్డుదారులకు హెచ్చరిక… ఇంకా 3 రోజులే ఉంది.. !
Recommended image2
Telangana Rains : తెలుగు ప్రజలకు చల్లనికబురు ... ఉదయం నుండి రాత్రివరకు వర్షాలే వర్షాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved