కేసీఆర్ బెంగళూరు పర్యటన: దేవెగౌడ, కుమారస్వామితో కలిసి భోజనం.. రాజకీయాలపై చర్చ (ఫోటోలు)
ఇటీవలే ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్కు చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ వెంటనే కర్ణాటక టూర్ పెట్టుకున్నారు. గురువారం బెంగళూరు చేరుకున్న ఆయన మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో భేటీ అయ్యారు.

kcr
మాజీ ప్రధాని దేవెగౌడతో సమావేశం అనంతరం ఆయన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడుతోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పక్కన కుమారస్వామి తదితరులు
kcr
బెంగళూరు పర్యటనలో వున్న సీఎం కేసీఆర్ ను కలిసిన తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్, సభ్యులు. అధ్యయనంలో భాగంగా కర్ణాటకలో బీసీ కమిషన్ బృందం పర్యటిస్తోంది
kcr
బెంగళూరులో దేవెగౌడ, కుమారస్వామితో రాజకీయాలు, ప్రత్యామ్నాయ కూటమి తదితర అంశాలపై చర్చలు జరుపుతోన్న తెలంగాణ సీఎం కేసీఆర్
kcr
బెంగళూరు చేరుకున్న అనంతరం మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిలకు పుష్పగుచ్ఛాన్ని అందజేస్తోన్న తెలంగాణ సీఎం కేసీఆర్, తదితరులు
kcr
మాజీ ప్రధాని దేవెగౌడ, కుమారస్వామిలతో భేటీ నిమిత్తం బెంగళూరుకు వెళుతూ ప్రత్యేక విమానంలో టీఆర్ఎస్ నేతలతో ముచ్చటిస్తోన్న తెలంగాణ సీఎం కేసీఆర్
kcr
బెంగళూరులోని దేవెగౌడ నివాసం వద్దకు చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు పుష్పగుచ్చాన్ని అందజేసి స్వాగతం పలుకుతున్న కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి
kcr
బెంగళూరులోని దేవెగౌడ నివాసంలో భోజనం చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్, పక్కన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి. పక్కన జేడీఎస్, టీఆర్ఎస్ నేతలు