MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక.. అల్పపీడన ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక.. అల్పపీడన ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

Telangana, Andhra Pradesh Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో గత కొన్ని రోజులుగా వర్షాలు కొనసాగుతున్నాయి. రాబోయే మూడు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావారణ శాఖ అంచనా వేసింది.  

2 Min read
Rajesh K
Published : Aug 27 2025, 09:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలుగు రాష్ట్రాలపై వరుణుడి ఉగ్రరూపం
Image Credit : X/Cyberabad Traffic Police

తెలుగు రాష్ట్రాలపై వరుణుడి ఉగ్రరూపం

Telangana, Andhra Pradesh Weather update: తెలుగు రాష్ట్రాలపై వరుణుడి పగపట్టారా? మరో మెరుపు దాడికి మేఘాలు సిద్ధమయ్యాయా? అంటే అవుననే అంటున్నారు వాతావరణశాఖ అధికారులు. తడిసిముద్దైన ఏపీ, తెలంగాణలకు మరోసారి వణికిపోయే వెదర్‌ రిపోర్ట్‌ ఇచ్చారు. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లను ప్రకటించారు. 

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు రెండు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవచ్చునని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 

25
తెలంగాణలో భారీ వర్షాలు
Image Credit : Getty

తెలంగాణలో భారీ వర్షాలు

తెలంగాణలో గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో రాత్రి నుంచి కుండపోత వర్షం కురువడం వల్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది. దీని కారణంగా ప్రజలకు, ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది.

మంగళవారం అత్యధికంగా వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో 3.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మర్పల్లిలో 3.3 సెం.మీ., సంగారెడ్డి జిల్లా మలిచెలమలో 3.3 సెం.మీ., ఖమ్మం జిల్లా పల్లెగూడెంలో 3.2సెం.మీ., వికారాబాద్ జిల్లా బంట్వారంలో 3.2 సెం.మీ., ములుగు జిల్లా వెంకటాపురంలో 3.2సెం.మీ., ఖమ్మం జిల్లా పంగిడిలో 3.2సెం.మీ., వరంగల్ జిల్లా కల్లెడలో 3.1సెం.మీ., భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.

Related Articles

Related image1
మరోసారి రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
Related image2
బంగాళాఖాతంలో అల్పపీడనం: 3 రోజులు భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ హెచ్చరికలు
35
ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
Image Credit : Sandeep/X

ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కామారెడ్డి, మెదక్, మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 

ఇవి కాకుండా, జనగాం, భూపాలపల్లి, గద్వాల్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నాగర్‌కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిజామాబాద్, పెద్దపల్లి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చని అధికారులు అంచనా వేశారు. 

హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ (IMD) ప్రకటించింది.

45
తడిసిముద్దైన ఉత్తరాంధ్ర
Image Credit : Getty

తడిసిముద్దైన ఉత్తరాంధ్ర

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ తడిసి ముద్దవుతుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. గత 24 గంటల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసాయి. అనకాపల్లి సాలపువానిపాలెంలో 6 సెంటీమీటర్లు, శ్రీకాకుళం 5.8 సెంటీమీటర్లు, ఇతర ప్రాంతాల్లో 5–5.5 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. పలు జాతీయ రహదారులు జలమయమవ్వడంతో రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.

వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బుధవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముంది. వర్షాలతో పాటు తీరం వెంబడి గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

55
వాతావరణ శాఖ హెచ్చరిక
Image Credit : Getty

వాతావరణ శాఖ హెచ్చరిక

అల్ప పీడనం కారణంగా మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు. సహాయక చర్యల కోసం NDRF, SDRF దళాలు సిద్ధంగా ఉన్నాయి. విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమత్తంగా ఉండమని, లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్లు 112, 1070, 18004250101గా పేర్కొన్నారు.

హోంమంత్రి అనిత రాష్ట్రంలోని పరిస్థితిని సమీక్షించారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. అదనంగా, క్షేత్రస్థాయిలో ఉండే అధికారులు, సహాయక దళాలు ప్రజలకు సమయానుగుణంగా సహాయం అందించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. 

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
వాతావరణం
ఏషియానెట్ న్యూస్
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved