MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Rajiv yuva vikasam scheme: నిరుద్యోగులకు బంపరాఫర్‌.. ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సాయం, దరఖాస్తులు ఎప్పుడంటే

Rajiv yuva vikasam scheme: నిరుద్యోగులకు బంపరాఫర్‌.. ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సాయం, దరఖాస్తులు ఎప్పుడంటే

తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు మహిళలను దృష్టిలో పెట్టుకొని పథకాలను ప్రవేశపెట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు నిరుద్యోగులకు లబ్ధి చేకూరేలా కీలక నిర్ణయం తీసుకుంది.  

2 Min read
Narender Vaitla
Published : Mar 15 2025, 09:30 AM IST | Updated : Mar 17 2025, 09:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
13
Representativer Image (Photo: Telangana Government)

Representativer Image (Photo: Telangana Government)

నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగాన్ని పెంచిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తాజాగా నిరుద్యోగుల కోసం అదిరిపోయే పథకాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. యువ వికాసం స్కీమ్‌ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్లు డిప్యూలీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇంతకీ ఏంటీ యువ వికాసం పథకం.? దీనికి ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం.. 
 

23
Asianet Image

రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగులకు లబ్ధి చేకూరే లక్ష్యంతో రాజీవ్‌ యువ వికాసం స్కీమ్‌ను తీసుకొచ్చారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 6 వేల కోట్లు కేటాయించనుంది. ఈ పథకం ద్వారా ఒక్కో లబ్ధిదారుడికి గరిష్ఠంగా రూ.3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఆర్థిక సాయం  అందించనున్నారు. కార్పొరేషన్ల సహాకారంతో ఈ పథకం అమలు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ పథకానికి సంబంధించి ఈరోజు (శనివారం) నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారు. 
 

33
Asianet Image

దరఖాస్తుల స్వీకరణ ఎప్పటి నుంచంటే.. 

ఈ నెల 15 నుంచి ఏప్రిల్​ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌ 6 నుంచి మే 31వ తేదీ వరకు దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేసి జూన్‌ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంజూరు పత్రాలు అందించనున్నట్లు తెలుస్తోంది. శనివారం విడుదల చేసే నోటిఫికేషన్‌లో పథకానికి సంబంధించి పూర్తి వివరాలు అందించనున్నారు. ప్రభుత్వం బ్యాంకు లింకేజీ ద్వారా రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు అందిస్తారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం ఈ పథకాన్ని తీసుకొస్తున్నారు. 

ఎలా ఎంపిక చేస్తారు.? 

రాష్ట్రంలో సుమారు 5 లక్షల మందికి ప్రయోజనం కల్పించేందుకు ఈ పథకాన్ని తీసుకొస్తున్నారు. ఈ పథ కం ద్వారా ఒక్కో జిల్లాకు కనీసం 10వేల మందికి ప్రయోజనం కలిగేలా ప్రణాళికలు రచిస్తున్నారు. నిరుద్యోగులు ఎంచుకునే యూనిట్ల ఆధారంగా రేట్‌ ఫిక్స్‌ చేస్తారని తెలుస్తోంది. కాగా పథకంలో ఏయే యూనిట్టు ఉండాలనే విషయంపై కూడా అధికారులు కసరత్తు చేశారు. వీటన్నింటికీ సంబంధించిన వివరాలను నోటిఫికేషన్‌లో పొందుపరచనున్నారు. 

Narender Vaitla
About the Author
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు. Read More...
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved