తెలంగాణలో కొత్త బార్లకు లైసెన్సులతో రెవిన్యూ: ఏటేటా పెరుగుతున్న ఎక్సైజ్ ఆదాయం
తెలంగాణ రాష్ట్రంలో ఎక్సైజ్ ఆదాయం ప్రతి ఏటా పెరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్సైజ్ ఆదాయం గణనీయంగా పెరిగింది.
రాష్ట్ర వ్యాప్తంగా 159 కొత్త బార్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఈ బార్ల ఏర్పాటు ద్వారా సుమారు రూ. 150 కోట్లు తెలంగాణ సర్కార్ కు ఆదాయం సమకూరనుంది.
ప్రతి ఏటా ఎక్సైజ్ ఆదాయం తెలంగాణలో పెరుగుతోంది. ఈ ఏడాది సుమారు రూ. 30వేల కోట్ల ఆదాయం ఆర్జించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కొత్త బార్లు ఏర్పాటు చేయడానికి అప్లికేషన్ పీజు, లైసెన్స్ ఫీజుల ద్వారా వచ్చే ఆదాయం వారంలో రూ. 135 కోట్లు దాటే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే ధరఖాస్తు రుసుం ద్వారా మాత్రమే రూ. 73 కోట్ల రూపాయాలకు పైగా సంపాదించింది. బార్ల లైసెన్స్ కోసం ధరఖాస్తులు సమర్పించేందుకు లక్ష రూపాయాలను నార్ రిఫాండబుల్ డిపాజిట్లు చెల్లించాల్సి ఉంటుంది.
రాష్ట్రంలో కొత్తగా 159 బార్ల ఏర్పాటు కోసం ఇప్పటికే 7360 ధరఖాస్తులు అందాయి. సోమవారం నాటికి ధరఖాస్తులు అందించేందుకు చివరి రోజు. సోమవారం నాడు 5311 ధరఖాస్తులు అందినట్టుగా ఎక్సైజ్ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి.
బార్ల లైసెన్స్ ల కోసం ధరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో వారం రోజులు పొడిగించింది. ధరఖాస్తు రుసుం కోసం దాదాపు రూ. 100 కోట్లు సంపాదించాలని ప్రభుత్వం భావిస్తోంది.
159 బార్లను ఏర్పాటు చేయడానికి ధరఖాస్తులను కోరుతూ ప్రభుత్వం జనవరి 25న నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో 55 జీహెచ్ఎంసీ పరిధిలో 55 ఉన్నాయి. జీహెచ్ఎంసీ సమీపంలోని మున్సిపాలిటీల్లో 19 కొత్త బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.
తెలంగాణలో ఇప్పటికే 800 బార్లు, 27 క్లబ్బులున్నాయి. వీటిలో 2144 మద్యం షాపులున్నాయి.
మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పోరేషన్లలో జనాభాను బట్్టి లైసెన్స్ ఫీజు రూ. 30 లక్షల నుండి రూ. 49 లక్షల వరకు ఉంటుంది. జీహెచ్ఎంసీ పరిమితుల్లో లైసెన్స్ ఫీజు రూ. 49 లక్షలుగా నిర్ణయించారు.
ఒక్కో బార్కి సగటున రూ. 40 లక్షల చొప్పున లైసెన్స్ ఫీజు రూ. 63 కోట్లకు పైగా రెవిన్యూ ఆర్జించాలని ఎక్సైజ్ శాఖ ప్లాన్ చేసింది. ఫిబ్రవరి 18న ఆయా జిల్లాల్లో కలెక్టర్లు డ్రా నిర్వహించి బార్లను కేటాయిస్తారు. జీహెచ్ఎంసీ పరిధిలో బార్ల లైసెన్స్ ల కోసం ఎక్సైజ్ డైరెక్టర్ అధ్యక్షతన లాటరీ తీయనున్నారు.
ప్రతి ఏటా ఎక్సైజ్ ఆదాయం పెరుగుతూ వస్తోంది. తెలంగాణ ఏర్పాటైన 2014-15 లో ఎక్సైజ్ ఆదాయం 10,813 ఆర్జించింది. అంతకుముందు ఏడాది 9800 కోట్ల ఆదాయం తెలంగాణ రాష్ట్రం ఎక్సైజ్ శాఖ ద్వారా ఆర్జించింది.
2018లో 20 వేల కోట్లకు ఎక్సైజ్ ఆదాయం పెరిగింది. 2019లో 25 వేల కోట్లకు చేరింది. 2020 ఎక్సైజ్ ఆదాయం గురించి అధికారులు ఇంకా గణాంకాలు విడుదల చేయలేదు. సుమారు 30 వేల కోట్లు ఎక్సైజ్ ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఎక్సైజ్ ఆదాయం కేవలం 26 శాతం మాత్రమే ఉంది. కానీ తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఎక్సైజ్ ఆదాయం 65 శాతానికి పెరిగింది.