పవన్ కల్యాణ్ కి కరోనా నెగెటివ్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్...
గత మూడు రోజులుగా కరోనాతో బాధపడుతున్న జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు కరోనా నెగెటివ్ వచ్చినట్లు సమాచారం. ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని ట్రినిటీ ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు.
గత మూడు రోజులుగా కరోనాతో బాధపడుతున్న జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు కరోనా నెగెటివ్ వచ్చినట్లు సమాచారం. ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని ట్రినిటీ ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు.
ఆ పరీక్షల్లో కరోనా నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మూడు రోజుల క్రితం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి కరోనా పాజిటివ్ గా తేలినట్లు జనసేన పార్టీ ప్రకటించింది.
కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో నిపుణులైన డాక్టర్ల ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స జరుగుతోందని జనసేన పార్టీ అధ్యక్షుల రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశారు.
''ఈ నెల 3వ తేదీన తిరుపతిలో జరిగిన పాదయాత్ర, బహిరంగ సభలో పాల్గొని హైదరాబాద్ కు చేరుకున్న తరవాత నలతగా ఉండడంతో పవన్ కల్యాణ్ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఫలితాలు నెగిటివ్ గా వచ్చాయి.
అయినప్పటికీ డాక్టర్ల సూచన మేరకు తన వ్యవసాయ క్షేత్రంలోనే క్వారంటైన్ కు వెళ్లారు. అయితే అప్పటి నుంచి కొద్దిపాటి జ్వరం, ఒళ్లునొప్పులు ఆయనను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. దీంతో రెండు రోజుల కిందట మరోసారి కోవిడ్ పరీక్షలు జరపగా పాజిటివ్ గా ఫలితం వచ్చింది'' అని హరిప్రసాద్ వెల్లడించారు.
కాగా ఇప్పుడు నెగటివ్ రావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీలో చాలా మందికి కరోనా సోకింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు. వరుణ్ తేజ్ కూడా కోవిడ్ బారిన పడి కోలుకున్నాడు. నాగబాబు, ఆయన భార్య పద్మజ కూడా కోవిడ్ బారిన పడి కోలుకున్నారు. ప్రస్తుతం వీరి ఆరోగ్యం బాగానే ఉంది.
తాజాగా కరోనా టీకా వేసుకున్న తర్వాత అల్లు అరవింద్ కూడా కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాత డాక్టర్ల సలహా మేరకు హోం ఐసోలేషన్లో ఉంటూ చికిత్స తీసుకొని కరోనా నుంచి కోలుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవికి కూడా కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. ఆ తరువాత మళ్లీ పరీక్షలు నెగిటివ్ వచ్చింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు