ఫలించిన హరీష్ రావ్ వ్యూహం.. 24 గంటల్లో తిరిగి సొంతగూటికి దుబ్బాక మున్సిపల్ కౌన్సిలర్లు..
వీరికి కండువా కప్పి పార్టీలోకి తిరిగి స్వాగతం పలికారు మంత్రి హరీష్ రావు. నిన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో ముగ్గురు టీఆర్ఎస్ కౌన్సిలర్లు బిజెపిలో చేరిన విషయం తెలిసిందే.
మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గార్ల సమక్షంలో దుబ్బాక మున్సిపాలిటీ కి చెందిన ఇద్దరు మున్సిపల్ కౌన్సిలర్లు స్వంత గూటికి చేరుకున్నారు.
వీరికి కండువా కప్పి పార్టీలోకి తిరిగి స్వాగతం పలికారు మంత్రి హరీష్ రావు. నిన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో ముగ్గురు టీఆర్ఎస్ కౌన్సిలర్లు బిజెపిలో చేరిన విషయం తెలిసిందే.
వీరిలో ఇద్దరు దివిటి కనకయ్య-7 వార్డ్, D. బాలకృష్ణ-8th వార్డ్ కౌన్సిలర్స్ ఈరోజు మంత్రి హరీష్ రావు సమక్షంలో టి ఆర్ ఎస్ పార్టీ లో చేరారు.. ప్రగతి ప్రభుత్వానికే జై అంటూ.. అభివృద్ధి చేస్తున్న టిఆర్ఎస్ పార్టీ లోనే ఉంటాం అంటూ పార్టీ లో చేరారు.
కాగా, మంగళవారం దుబ్బాక మున్సిపాలిటీ లో ముగ్గురు సిట్టింగ్ తెరాస కౌన్సిలర్లను బీజేపీలో చేర్చి అధికార పార్టీ ని కోలుకోలేని దెబ్బ కొట్టాడు ఎమ్మెల్యే రఘునందన్ రావు.
దుబ్బాకలో ముగ్గురు అధికార తెరాస కౌన్సిలర్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో బీజేపీ లో చేరారు. ఎమ్మెల్యే రఘునందన్ నేతృత్వంలో దుబ్బాకలో అభివృద్ధి కోసం కృషి చేస్తామని, తెరాస దుబ్బాకను కావాలని టార్గెట్ చేయడం తగదని వారన్నారు.
కౌన్సిలర్లు మట్ట మల్లారెడ్డి - 3 వార్డు, దివిటి కనకయ్య - 7 వ వార్డు, దుబ్బాక బాలకృష్ణ గౌడ్ - 8 వ వార్డు నుంచి బీజేపీ లో చేరారు. దుబ్బాక నే కాదు తెలంగాణ సమాజం మొత్తం కూడా బీజేపీ వైపు చూస్తోందన్నారు.
దుబ్బాక ద్వారా దానికి నాంది పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెరాస కౌన్సిలర్లకు బండి సంజయ్ కండువా కప్పి బీజేపీలోకి స్వాగతం పలికారు.