భద్రాద్రి రామయ్యకు స్వర్ణ భద్రకవచాలు.. చరిత్రలోనే మొదటిసారి...
భద్రాద్రి దేవస్థానం చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా భద్రాద్రి రామయ్యకు స్వర్ణ భద్రకవచాలు అమరాయి.
భద్రాద్రి దేవస్థానం చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా భద్రాద్రి రామయ్యకు స్వర్ణ భద్రకవచాలు అమరాయి.
సుమారు 13.50 కిలోల స్వర్ణంతో బెంగళూరుకు చెందిన జేవీ రంగరాజు దంపతులు, వారి కుటుంబ సభ్యుల సహకారంతో స్వర్ణ కవచాన్ని తయారు చేయించారు.
రామయ్య స్వర్ణ భద్రకవచాలను ప్రముఖ స్థపతి కోదండపాణి ప్రత్యేకంగా తయారు చేయడం విశేషం.
ఇకనుంచీ ప్రతి శుక్రవారం రామయ్య స్వర్ణ కవచాలతో బంగారు రామయ్యగా భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు.
భద్రాద్రి దేవస్థానం ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు ఇంత భారీస్థాయిలో విరాళాన్ని అందజేసిన దాతలు లేరు.