MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • మునుగోడు కాంగ్రెస్‌లో ఆధిపత్యపోరు: ఎమ్మెల్యే టిక్కెట్టుపై స్రవంతి, కృష్ణారెడ్డి మధ్య రచ్చ

మునుగోడు కాంగ్రెస్‌లో ఆధిపత్యపోరు: ఎమ్మెల్యే టిక్కెట్టుపై స్రవంతి, కృష్ణారెడ్డి మధ్య రచ్చ

కాంగ్రెస్ పార్టీకి  చెందిన  నేతలు  పాల్వాయి స్రవంతి,  చలమల కృష్ణారెడ్డిలు  పరస్పరం విమర్శించుకుంటున్నారు.  వచ్చే  ఎన్నికల్లో  టిక్కెట్టు  అంశం కేంద్రంగా   సాగుతున్న ప్రచారం  ఈ ఇద్దరు  నేతల మధ్య  వివాదానికి  కారణమైంది.

2 Min read
Author : narsimha lode
Published : Apr 11 2023, 05:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఆధిపత్యపోరు

ఆధిపత్యపోరు

కాంగ్రెస్ పార్టీకి  చెందిన మునుగోడు  నేతల మధ్య ఆధిపత్య పోరు  మరోసారి  రచ్చకెక్కింది.  పాల్వాయి స్రవంతి,  కృష్ణారెడ్డిలు  ఒకరిపై  మరొకరు  విమర్శలు  చేసుకుంటున్నారు.   మునుగోడు  అసెంబ్లీ స్థానానికి  ఉప  ఎన్నికలు  పూర్తైన తర్వాత  ఈ ఇద్దరు  నేతలు  నియోజకవర్గంలో  పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు.

27
ఆధిపత్య పోరు

ఆధిపత్య పోరు

గత  ఏడాది  జరిగిన  మునుగోడు  అసెంబ్లీ  ఉప ఎన్నికల్లో  పాల్వాయి  స్రవంతికి  కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు  కేటాయించింది.  కానీ  ఉప ఎన్నికల్లో  టిక్కెట్టు  కోసం  చలమల కృష్ణారెడ్డి  కూడా తీవ్రంగా  ప్రయత్నించారు.  కృష్ణారెడ్డికి రేవంత్ రెడ్డి  సపోర్ట్ ఉందని  ప్రచారం  సాగింది.  కానీ,   పార్టీ సీనియర్లంతా  పాల్వాయి స్రవంతి  వైపే మొగ్గు చూపారు. దీంతో పాల్వాయి స్రవంతికే  కాంగ్రెస్ టిక్కెట్టు కేటాయించింది. 

37
ఆధిపత్యపోరు

ఆధిపత్యపోరు

వచ్చే ఎన్నికల్లో  కాంగ్రెస్ టిక్కెట్టు  విషయమై  సాగుతున్న  ప్రచారం  కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతి  మధ్య  రచ్చకు  కారణమైంది. వచ్చే  ఎన్నికల్లో తనకే  టిక్కెట్టు  అంటూ  ప్రచారంచేసుకుంటున్నారని  కృష్ణారెడ్డిని ఉద్దేశించి పాల్వాయి స్రవంతి  ఆరోపిస్తున్నారు.

47
ఆధిపత్య పోరు

ఆధిపత్య పోరు

కాంగ్రెస్ పార్టీలో  కోవర్టులు, వెధవలున్నారని  కృష్ణారెడ్డి  చేసిన  విమర్శలపై  పాల్వాయి స్రవంతి  మండిపడ్డారు.  కోవర్టులు,  వెధవలు ఎవరో చెప్పాలని  పాల్వాయి స్రవంతి డిమాండ్  చేశారు. 

57
ఆధిపత్యపోరు

ఆధిపత్యపోరు

టిక్కెట్టు  కేటాయింపు  విషయంలో  సాగుతున్న ప్రచారం  కాంగ్రెస్ పార్టీ  క్యాడర్ ను గందరగోళానికి  గురి  చేస్తుందని స్రవంతి  అభిప్రాయపడ్డారు.ఈ విషయమై  టీపీసీసీ చీఫ్  రేవంత్  రెడ్డికి ఫిర్యాదు  చేస్తామని కూడా  ఆమె  చెప్పారు. 

67
ఆధిపత్యపోరు

ఆధిపత్యపోరు

మునుగోడు  అసెంబ్లీ  నియోజకవర్గంలో  కమిటీల  ఏర్పాటు  విషయమై  కూడా ఆమె ఈ సందర్భంగా గుర్తు  చేశారు. రాష్ట్రంలో  ఎక్కడా  కమిటీల  నియామకం జరగేలేదన్నారు. కానీ, మునుగోడు నియోజకవర్గంలోనే కమిటీలను  ఏర్పాటు  చేశారని  స్రవంతి  చెప్పారు.  ఈ విషయమై  పార్టీ అధిష్టానానికి  ఫిర్యాదు చేస్తామన్నారు. 

77
ఆధిపత్యపోరు

ఆధిపత్యపోరు

2018  అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్  అభ్యర్ధిగా కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి   మునుగోడు  నుండి  పోటీ  చేసి  విజయం సాధించారు.  గత ఏడాది  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  కాంగ్రెస్ కు గుడ్ బై  చెప్పారు.  బీజేపీలో  చేరారు.  దరిమిలా  మునుగోడు  ఎమ్మెల్యే  పదవికి  కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి  రాజీనామా  చేయడంతో  మునుగోడు  ఉప ఎన్నికలు  జరిగాయి

About the Author

NL
narsimha lode
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
అధికార కాంగ్రెస్ బిగ్ షాక్ .. మాజీ మంత్రి రాజీనామా..? అసలు కారణమేంటో తెలుసా? | Asianet News Telugu
Recommended image2
Now Playing
KTR Comments on CM Revanth Reddy: అసెంబ్లీలో రేవంత్ రెడ్డిపై కేటీఆర్ పంచ్ లు| Asianet News Telugu
Recommended image3
హైద‌రాబాద్‌లో ఆంటీలుంటారా అంటూ యాడ్స్ వ‌స్తున్నాయా.? క్లిక్ చేశారో అంతే. సజ్జ‌నార్ వార్నింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved