MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Telangana
  • తిరిగి ఎమ్మెల్సీగా ఏకగ్రీవం... తల్లితో కలిసి అష్టలక్ష్మి అమ్మవారికి కవిత ప్రత్యేక పూజలు

తిరిగి ఎమ్మెల్సీగా ఏకగ్రీవం... తల్లితో కలిసి అష్టలక్ష్మి అమ్మవారికి కవిత ప్రత్యేక పూజలు

నిజామాబాద్ స్థానికసంస్థల కోటా ఎమ్మెల్సీగా తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయిన సీఎం కూతురు కవిత తల్లి శోభతో కలిసి దిల్ సుఖ్ నగర్ అష్టలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

1 Min read
Author : Arun Kumar P
Published : Nov 26 2021, 10:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

హైదరాబాద్: తిరిగి నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ(శుక్రవారం) ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన పత్రాలను ఎన్నికల అధికారుల నుండి కవిత స్వీకరించనున్నారు. ఇందుకోసం నిజామాబాద్ కు వెళ్లేముందు దిల్ సుఖ్ నగర్ లోని అష్టలక్ష్మి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్సీ కవిత. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

తల్లి శోభతో పాటు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మరికొందరు కుటుంబసభ్యులు, టీఆర్ఎస్ మహిళా నాయకులతో కలిసి ఆలయం వద్దకు చేరుకున్న కవితకు పార్టీ శ్రేణుల నుండి ఘనస్వాగతం లభించింది. ఆలయ సిబ్బంది సాంప్రదాయబద్దంగా వీరిని ఆలయంలోకి తీసుకువెళ్లారు. 

34

అష్టలక్ష్మి అమ్మవారికి cm kcr wife kalvakunta shobha, daughter kavitha ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ అనంతరం ధ్వజస్తంభానికి మొక్కుతూ అమ్మవారి ఆలయంచుట్టూ ప్రదక్షిణలు చేసారు. ఆ తర్వాత ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను కల్వకుంట్ల శోభ, కవితకు అందజేసారు.

44

సీఎం సతీమణి, కూతురు రాకతో దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో కోలాహలం నెలకొంది. అమ్మవారి ఆలయం వద్దకు భారీఎత్తున టీఆర్ఎస్ శ్రేణులు చేరుకుని స్వాగతం పలికారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్ గుప్త, స్థానిక టీఆర్ఎస్ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. కుండపోత వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ బిగ్ అలర్ట్
Recommended image2
Konda Surekha: పదవి పోయిందని ఇంట్లో కూర్చోం.. కొండా సురేఖ కీల‌క వ్యాఖ్య‌లు
Recommended image3
హైద‌రాబాద్‌లో అత్యంత ఎత్తైన బిల్డింగ్స్ ఇవే.. 59 అంత‌స్తులతో మేఘాల‌ను తాకేలా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved