MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • టీ బిజెపి ప్లాన్.. డీకే అరుణకు అధ్యక్షపగ్గాలు!.. ఎన్నికల స్టీరింగ్‌ కమిటీ చైర్మన్‌ గా ఈటెల?

టీ బిజెపి ప్లాన్.. డీకే అరుణకు అధ్యక్షపగ్గాలు!.. ఎన్నికల స్టీరింగ్‌ కమిటీ చైర్మన్‌ గా ఈటెల?

బీఆర్ఎస్ రెబల్ నాయకులు పొంగులేటి, జూపల్లిలు కాంగ్రెస్‌లో చేరడంతో.. బీజేపీ నాయకత్వంలో మార్పులు అనివార్యంగా కనిపిస్తున్నాయి. దీంతో డీకే అరుణ, ఈటలలు రాష్ట్ర బీజేపీ మీద పూర్తి పట్టు కైవసం చేసుకోవచ్చు

4 Min read
Bukka Sumabala
Published : Jun 09 2023, 10:24 AM IST| Updated : Jun 09 2023, 10:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

హైదరాబాద్ : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పార్టీల్లో మార్పులు చేర్పులు భారీగానే జరుగుతున్నాయి. రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలలో ఎట్టకేలకు పెద్ద మార్పులు చోటుచేసుకోనున్నాయి. దీంతో మరో రెండు రోజుల్లో తెలంగాణ రాజకీయాలు భిన్నంగా కనిపించనున్నాయి. నాయకత్వ స్థానాల్లో ప్రధాన పరిణామాలు ప్రకటించే అవకాశం ఉంది. దీంతోపాటే తాజా చేరికలు కూడా ఏకకాలంలో జరిగే అవకాశం ఉంది.

213

బీజేపీ అధిష్టానం తెలంగాణలో రాష్ట్ర అధ్యక్ష మార్పు చేయాలనే యోచనలో ఉంది. దీనిని అనుగుణంగానే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ స్థానంలో టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన ఈటెల రాజేందర్ కు పార్టీ పగ్గాలు అందిస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు డీకే అరుణ కూడా ఈ రేసులో ఉన్నట్లుగా తెలుస్తోంది. 

313

టీఆర్ఎస్ రెబల్ నాయకులు, అత్యంత డిమాండ్ ఉన్న నాయకులైన - ఖమ్మం లోక్‌సభ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మాజీ మంత్రి, కొల్లాపూర్ నుండి ఐదుసార్లు ఎమ్మెల్యే అయిన జూపల్లి కృష్ణారావులు బీజేపీలో చేరతారన్న కొన్ని వారాల ఊహాగానాలకు తెరదించుతూ చివరకు కాంగ్రెస్‌లో చేరనున్నారు. పొంగులేటి-జూపల్లి ద్వయం చేరికతో కాంగ్రెస్ లో నూతనోత్తేజం పుంజుకుంది. దీనిమీద సీనియర్ బిజెపి నాయకులు మీడియాతో మాట్లాడుతూ, తాము ఎంత ప్రయత్నించినప్పటికీ, వారిద్దరినీ కాషాయ గూటికి వచ్చేలా ఒప్పించలేకపోయామని తెలిపారు. 

413

పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ లో చేరడం మీద ఓ సీనియర్ నేత మాట్లాడుతూ.. ‘డీల్ కుదిరింది. వారి ముఖ్య అనుచరులకు, క్యాంపు సభ్యులకు ఇవ్వాల్సిన వివిధ పదవులు, టిక్కెట్లతో సహా అన్ని అంశాలపై చర్చించాం. ఇది ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కాంగ్రెస్‌కు భారీ ఊరటనిస్తుంది. తెలంగాణలో తోక పార్టీలు అన్నదానికి దీంతో చెక్ పెట్టొచ్చు. ముక్కోణపు పోరు అన్న మాటలు దీంతో మాయమయ్యాయి, ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య నేరుగా పోరు సాగుతోంది, అధికార పార్టీమీద ఉన్న వ్యతిరేకత దృష్ట్యా.. మేము గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’’ అని అన్నారు. పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ సీనియర్ నేత కాంగ్రెస్ లోకి వీరిద్దరి ఎంట్రీని ఖరారు చేసేందుకు చర్చల్లో భాగంగా ఉన్నారు. 

513

"బిజెపి, బిఆర్ఎస్ రెండింటి నుండి చాలా మంది నాయకులు టచ్‌లో ఉన్నారు. వారిలో చాలా మంది రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌లో చేరనున్నారు" అని కూడా ఆయన చెప్పారు. అదే సమయంలో, తెలంగాణ రాష్ట్ర బిజెపి ఈ ఇద్దరు నాయకులను తమ శిబిరానికి ఆకర్షించడంలో చాలా ప్రయత్నాలు చేసింది. కానీ విఫలమయ్యింది. ఈ నేపథ్యంలో అతి త్వరలో రాష్ట్ర నాయకత్వంలో మార్పు వచ్చే అవకాశం ఉందనే చర్చకు తెరతీసింది. బైటినుంచి వచ్చినవారి చేతుల్లోకి పార్టీ పగ్గాలు వెళ్లే అవకాశం ఉంది. 

613

పార్టీ సీనియర్ నేతలెవరూ ఆన్ ద రికార్డ్ ధృవీకరించడానికి ఇష్టపడడం లేదు. "అలాంటి ప్రతిపాదనలేవీ మాకు తెలియవు" అని మాత్రమే చెబుతున్నారు. కాగా, ముగ్గురు వేర్వేరు నాయకులు మాత్రం దీన్ని ధృవీకరించారు. మాజీ మంత్రి, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బండి సంజయ్‌కుమార్‌ నుంచి బాధ్యతలు చేపట్టగా, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ఎన్నికల స్టీరింగ్‌ కమిటీ చైర్మన్‌ హోదాలో ఎన్నికల నిర్వహణ పగ్గాలు అప్పగించనున్నారు.

ఇద్దరు సీనియర్ నాయకులు అత్యంత గౌరవనీయమైన నాయకులు, డీ.కె. అరుణ, రాజేందర్‌లు బిజెపిని కైవసం చేసుకుంటే, రాష్ట్ర నాయకత్వం పూర్తిగా కొత్తవారి చేతుల్లోకి రావడం ఇదే మొదటిసారి అవుతుంది. డి.కె. అరుణ కాంగ్రెస్ నాయకురాలు, ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ లో అత్యున్నత స్థాయి నాయకుడిగా, ప్రత్యేక రాష్ట్రవాదిగా పనిచేసి.. ఆరోగ్యశాఖా మంత్రిగా పదవి బాధ్యతలు నిర్వహించారు. 

713

బండి సంజయ్‌ను రాష్ట్ర మంత్రిగా, దేశ రాజధానికి మార్చవచ్చని మరో ఇద్దరు నాయకులు ధృవీకరించారు. ఏదైనా కార్యనిర్వాహక పదవిలోనైనా సంజయ్ కు మొదటిసారి - కేంద్ర మంత్రిత్వ శాఖలో అవకాశం కల్పించనున్నారు. దీంతో రాష్ట్రం నుండి కేంద్ర మంత్రిత్వ శాఖలో ప్రాతినిధ్యాన్ని రెండుకు పెంచారు. మరో సీనియర్ నాయకుడు డాక్టర్ కె. లక్ష్మణ్ పార్టీ అపెక్స్ బాడీ అయిన పార్లమెంటరీ బోర్డులో భాగం, ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.

813

మునుగోడు ఉపఎన్నికలో ఓడిపోయినప్పటి నుంచి తెలంగాణలో ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని చూస్తున్న తరుణంలో రాష్ట్ర బీజేపీలో మార్పులు తప్పనిసరి అయ్యాయి. కర్ణాటకలో ఓడిపోవడం, పలువురు నేతల బహిరంగంగా అసమ్మతిని వ్యక్తపరచడం వల్ల.. పరిస్థితిని యథాతథంగా కొనసాగించడం కష్టతరం చేసింది’’ అని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. మరోవైపు బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని కాంగ్రెస్ అంటోంది.

 

913

పార్టీ నాయకత్వ నిర్మాణంలో మార్పులతో తన మునుపటి జోష్ ను మళ్లీ పొందాలని బీజేపీ భావిస్తోంది, ఈ మార్పుల వల్ల అన్ని అసమ్మతులకు ముగింపు పలుకొచ్చని.. కాషాయ పార్టీ సామాజిక ఇంజనీరింగ్ ప్రణాళికలకు మద్దతు ఇచ్చేలా ఈ మార్పు జాగ్రత్తగా రూపొందించబడిందని తెలుస్తోంది.

1013

"పార్టీని పర్యవేక్షించడానికి అధ్యక్షుడిగా ఒక రెడ్డి నాయకుడు. ఎన్నికల ప్రయత్నాలకు నాయకత్వం వహించడానికి స్టీరింగ్ కమిటీ ఛైర్మన్‌గా ముదిరాజ్‌లు బిజెపికి అపారమైన శక్తిని ఇస్తారు" అని సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. ప్రస్తుత అధ్యక్షుడు బండి సంజయ్‌కు వ్యతిరేకంగా పార్టీ "పార్టీ ప్రధానంగా రెడ్డి, ఇతర ఉన్నత కులాల ఓట్లతో పాటు, సమాజంలోని కెసిఆర్ వ్యతిరేక వర్గాలను ఆకర్షించడానికి ప్రయత్నించడం వల్ల ఒబిసి ఓట్లపై ఆధారపడాల్సి ఉంటుంది."

1113

మరోవైపు పార్టీలోని కొంత మంది నేతలు ఇలాంటి మార్పులు జరగకపోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సమాచారం ప్రకారం సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగిస్తూనే.. ఈటెల రాజేందర్, డీకే అరుణలకు కొన్ని "అదనపు బాధ్యతలు" ఇవ్వొచ్చు. దీనివల్ల బండిసంజయ్ కు పూర్తి నాయకత్వం విషయంలో తక్కువ పట్టు ఉంటుంది.

1213

రాష్ట్రం, కేంద్రానికి చెందిన ఇద్దరు వేర్వేరు నేతల అభిప్రాయం ప్రకారం రాష్ట్రంలో అధికారం మారితే అది రాజేందర్‌ను రాష్ట్ర అధ్యక్షుడిని చేయడమేనని అన్నారు. బిజెపి తన బలాన్ని ప్రదర్శించడానికి అగ్ర నాయకులను రాష్ట్రానికి తీసుకురావడంతో సహా అనేక కార్యక్రమాలను చేపట్టింది. దీంట్లో భాగంగనే 

1313

"రాష్ట్రంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా కోసం రెండు భారీ కార్యక్రమాలను ప్లాన్ చేయడమే కాకుండా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నగరంలో బహిరంగ సభలో వ్యక్తిగతంగా ప్రసంగించడం ఉంది" అని ఆయన చెప్పారు.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
Recommended image2
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
Recommended image3
IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved