MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • దేశ రాజధానిలోనూ తెలంగాణ భవన్... కేసీఆర్ చేతులమీదుగా భూమి పూజ, ముహూర్తం ఖరారు

దేశ రాజధానిలోనూ తెలంగాణ భవన్... కేసీఆర్ చేతులమీదుగా భూమి పూజ, ముహూర్తం ఖరారు

దేశ రాజధాని న్యూడిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం కోసం కేంద్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలంలో తెలంగాణ భవన్ నిర్మాణం చేపట్టడానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

1 Min read
Author : Arun Kumar P | Asianet News
Published : Aug 30 2021, 02:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

హైదరాబాద్: దేశ రాజధాని న్యూడిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం చకాచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఢిల్లీలోని వసంత్ విహార్ మెట్రో స్టేషన్ పక్కన పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం టీఆర్ఎస్ కు 1300ల గజాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. ఆ స్థలంలో విశాలంగా, అన్ని సౌకర్యాలతో కార్యాలయాన్ని నిర్మించాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది.  

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ చేతులమీదుగా కార్యాలయ నిర్మాణానికి భూమి పూజకు మూహూర్తం ఖరారయ్యింది. వచ్చే నెల సెప్టెంబర్ 2న భూమి పూజ నిర్వహించనున్నారు. ఇందుకోసం సెప్టెంబర్ 1 నుండి 3వ తేదీ వరకు సీఎం కేసీఆర్ డిల్లీలో వుండనున్నారు. 

35


భూమి పూజకు ముహూర్తం ఖరారయిన నేపథ్యంలో తెలంగాణ భవన్ నిర్మాణ ప్రాంతాన్ని చదును చేస్తున్నారు. భూమిపూజలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, నామినేటెడ్ పదవుల్లో వున్నవారు, పార్టీ పదవుల్లో వున్నావారు, కార్యకర్తలు భారీగా పాల్గొననున్నారు. ఇందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు కూడా భారీగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. 

45

ఇలా మూడు రోజులపాటు కేసీఆర్ ఢిల్లీలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 1న మధ్యాహ్నం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. రాత్రి అక్కడే బసచేసి సెప్టెంబర్ 2న మధ్యాహ్నం 12:30 గంటలకు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం కేటాయించిన స్థలంలో భూమిపూజ చేయనున్నారు.

55

న్యూడిల్లిలో కార్యక్రమాలన్నీ ముగించుకుని సెప్టెంబర్ 3న మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్ కు బయలుదేరనున్నారు సీఎం కేసీఆర్. ఈ మేరకు ఆయన పర్యటనకు సంబంధించిన వివరాలను సీఎం కార్యాలయం ఖరారు చేసింది. 
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bullet Train: హైదరాబాద్ టు అమరావతి కేవలం 70 నిమిషాలే ! బుల్లెట్ ట్రైన్ రూట్ మ్యాప్ ఇదే !
Recommended image2
ఇక్క‌డ హ‌నుమంతుడు పాతాళంలో ఉంటాడు.. ప్రపంచంలో ఇలాంటి ఏకైక ఆల‌యం మన హైదరాబాద్‌లోనే
Recommended image3
Beer Sales: తెలంగాణలో ఎవ్వరూ ఊహించని స్థాయిలో బీర్ అమ్మకాలు,ఒక్క ఏప్రిల్ లోనే ఎన్ని బాటిల్స్ తాగేశారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved