Weather : ఒకేరోజు చలి, వాన, ఎండ ... తెలుగురాష్ట్రాల్లో ఇవాళ్టి వాతావరణ సమాచారమిదే
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ విచిత్రమైన వాతావరణం కనిపించనుంది. ఈ ఒక్కరోజే చలి, ఎండ, వాన ... ఇలా మూడు రకాల వాతావరణం కనిపిస్తుందని ఐఎండి ప్రకటించింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Today Weather
Today Weather : తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ వాతావరణం మిక్సుడ్ గా ఉండనుంది. చలి, ఎండా, వాన... ఇలా అన్ని రకాల వాతావరణం కనిపిస్తుంది. ఇండియన్ మెటలర్జి డిపార్ట్ మెంట్ (IMD) ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి 22న వాతావరణం ఎలా ఉంటుందో చూద్దాం.
today telangana weather, today andhra pradesh weather
నేడు తెలంగాణ వాతావరణ సమాచారం :
ఫిబ్రవరి 22 (శనివారం) తెలంగాణలో వాతావరణం ఎలా ఉండనుందో IMD అంచనా వేసింది. దీని ప్రకారం అత్యల్పంగా 22 డిగ్రీలు, అత్యధికంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవవుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇటీవల వాతావరణం కాస్త చల్లగామారి అక్కడక్కడా చిరుజల్లుకు కూడా కురిసాయి. ఈ వాతావరణం కొన్నిప్రాంతాల్లో ఇవాళ కూడా కొనసాగుతుందని... చిరుజల్లులకు అవకాశం ఉందని IMD తెలిపింది.
ఇక హైదరాబాద్ తో పాటు కొన్నిప్రాంతాల్లో ఒకేరోజులో అన్ని వాతావరణ పరిస్థితులు కనిపించనున్నాయి. ఉదయం పొగమంచు కురిసి చల్లని వాతావరణం ఉంది. ఇక మధ్యాహ్నం ఎండ దంచికొడుతుంది. సాయంత్రం సమయంలో వాతావరణం చల్లబడి చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది.
నేడు ఆంధ్ర ప్రదేశ్ వాతావరణ సమాచారం :
తెలంగాణ కంటే ఆంధ్ర ప్రదేశ్ లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఇదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది... ఆకాశం మేఘావృతమై వాతావరణం కాస్త చల్లగా ఉంటుందని ప్రకటించారు.
నేడు ఫిబ్రవరి 22న ఇక్కడ అత్యల్పంగా 23 డిగ్రీలు, అత్యధికంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని ఐఎండి అంచనా వేస్తోంది. నిన్న అత్యధికంగా 37.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.
summer 2025
ఈసారి మండిపోనున్న ఎండలు :
దేశవ్యాప్తంగా ఈసారి ఎండలు మండిపోనున్నాయి...గతేడాది కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయిని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంకా ఫిబ్రవరి కూడా ముగియలేదు... అప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీన్నిబట్టేఈసారి ఎండలు ఎలా ఉండనున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ సారి సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయట.
వేసవిలో పిల్లలు, వృద్దులతో ప్రయాణాలు పెట్టుకోవద్దని... వారిని సురక్షితంగా ఇళ్లలోనే ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. వేసవితాపం నుండి ఉపశమనం పొందేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు. మార్చి, ఏప్రిల్, మే ఈ మూడునెలలు ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరతాయి... కాబట్టి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.