MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • బ్యాంకుల్లో కలకలం... ఆగిపోయిన పేమెంట్ సిస్టం ! ఏం జరిగిందో తెలుసా?

బ్యాంకుల్లో కలకలం... ఆగిపోయిన పేమెంట్ సిస్టం ! ఏం జరిగిందో తెలుసా?

తాజాగా మైక్రోసాఫ్ట్ సర్వర్‌లో లోపం కారణంగా బ్యాంకుల నుండి స్టాక్ మార్కెట్ వరకు ప్రపంచవ్యాప్తంగా ఆందోళణలు వ్యక్తమయ్యాయి, అయితే ఇప్పుడు భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థపై పెద్ద సైబర్ దాడి జరిగింది. ఈ కారణంగా దేశం ఇబ్బందుల్లో పడింది, దాదాపు 300 చిన్న బ్యాంకుల్లో సేవలు నిలిచిపోయాయి.

2 Min read
Author : Ashok Kumar
Published : Aug 01 2024, 03:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

 ransomware దాడి కారణంగా వందలాది బ్యాంకుల పేమెంట్ వ్యవస్థలు కూడా విఫలమైనట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం, ఈ చిన్న బ్యాంకులన్నింటికీ టెక్నికల్ సహాయాన్ని అందించే కంపెనీపై ఈ సైబర్ దాడి జరిగింది. 

300 బ్యాంకుల పేమెంట్ వ్యవస్థ ఫెయిల్
 భారత బ్యాంకింగ్ వ్యవస్థ గురించి గురువారం ఒక పెద్ద వార్త వచ్చింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, C-Edge Technologies కంపెనీపై ransomware దాడి జరిగింది. ఈ కంపెనీ దేశంలోని అన్ని చిన్న బ్యాంకులకు టెక్నికల్  సపోర్ట్  సేవలను అందిస్తుంది. ఈ కంపెనీపై సైబర్ దాడి నేరుగా దానితో అనుబంధించిన సుమారు 300 బ్యాంకులను ప్రభావితం చేసింది.  
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

సైబర్ దాడిపై మౌనం పాటించిన కంపెనీ!
ఈ విషయానికి సంబంధించిన సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న చిన్న బ్యాంకులకు బ్యాంకింగ్ టెక్నికల్ సహాయాన్ని అందించే సి-ఎడ్జ్ టెక్నాలజీస్ ఈ సైబర్ దాడి వల్ల తీవ్రంగా ప్రభావితమైందని నివేదిక పేర్కొంది. అయితే, ఈ సైబర్ దాడికి సంబంధించి సీ-ఎడ్జ్ టెక్నాలజీస్ ఎలాంటి స్పందన  చేయలేదు. ఈ విషయంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కూడా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. 

35

 సైబర్ దాడిని గుర్తించిన NPCI
భారతదేశంలో పేమెంట్ వ్యవస్థను పర్యవేక్షించే సంస్థ (NPCI) తాత్కాలికంగా ఈ చర్యను నిలిపివేసింది. బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో NPCI C-Edge Technologiesపై కొంతకాలం నిషేధించబడిందని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ కంపెనీ రిటైల్ పేమెంట్ వ్యవస్థకు దూరంగా ఉంటుందని పేర్కొంది. 

45

NPCI అధికారుల ప్రకారం, ప్రభావితమైన బ్యాంకులు C-Edge Technologies సేవలను ఉపయోగిస్తున్నాయి, కొంత కాలం పాటు పేమెంట్  వ్యవస్థను ఉపయోగించడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ దృష్ట్యా దేశంలోని పేమెంట్ వ్యవస్థపై విస్తృతంగా ఎలాంటి ప్రభావం పడకుండా ఉండేందుకు దాదాపు 300 చిన్న బ్యాంకులను పేమెంట్ నెట్‌వర్క్‌కు దూరంగా ఉంచాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
 

55

దేశంలోని సుమారు 15,000 చిన్న బ్యాంకులు 
భారతదేశంలో దాదాపు 1,500 సహకార, ప్రాంతీయ బ్యాంకుల  భారీ నెట్‌వర్క్‌ ఉంది, ఇవి ప్రధానంగా ముఖ్యమైన నగరాల బయట  ఉన్న కస్టమర్లకు బ్యాంకింగ్ సేవలను అందిస్తాయి. C-Edge Technologiesపై ransomware దాడి వల్ల ఈ చిన్న బ్యాంకులు మాత్రమే ప్రభావితమయ్యాయి. అయితే, సైబర్ దాడికి గురైన ఈ బ్యాంకులు దేశంలోని మొత్తం పేమెంట్ వ్యవస్థలో కేవలం 0.5 శాతం వాటా మాత్రమే ఉన్నాయని వర్గాలు తెలిపాయి. ప్రజలకి దీని వలన పెద్దగా సమస్య ఉండదు, కానీ పేమెంట్  వ్యవస్థపై దాని ప్రభావం కొంత సమయం వరకు ఖచ్చితంగా ఉండవచ్చు

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Wireless Charging: వైర్‌లెస్ ఛార్జింగ్ ఎలా ప‌నిచేస్తుంది.? దీనివ‌ల్ల ఫోన్ బ్యాట‌రీపై ప్ర‌భావం ప‌డుతుందా.?
Recommended image2
Portronics Vayu: పాకెట్‌లో ప‌ట్టే ఈ ప్రొడ‌క్ట్‌ ఉంటే చాలు.. ఎక్క‌డికైనా బిందాస్‌గా వెళ్లొచ్చు
Recommended image3
Realme 16T 5G: ఏఐ టూల్స్‌తో ఫొటోలు, వీడియోలు.. రియ‌ల్‌మీ నుంచి క‌ళ్లు చెదిరే స్మార్ట్‌ఫోన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved