MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • IPL : కోహ్లీ, ధోని టీమ్స్ మధ్య మరో వివాదం.. రంగంలోకి బీసీసీఐ ! ఏంది బాసూ ఈ రచ్చ

IPL : కోహ్లీ, ధోని టీమ్స్ మధ్య మరో వివాదం.. రంగంలోకి బీసీసీఐ ! ఏంది బాసూ ఈ రచ్చ

IPL 2026 : ఐపీఎల్ లో రెండు తోపు టీమ్స్ మధ్య మరో రచ్చ మొదలైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 'దోస ఇడ్లీ' సాంగ్‌తో పాటు తమ ఆటగాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీసీసీఐకి సీఎస్‌కే ఫిర్యాదు చేసింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 16 2026, 08:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆర్‌సీబీ మ్యాచ్‌లో 'దోస ఇడ్లీ' పాటతో మరో రచ్చ
Image Credit : our own

ఆర్‌సీబీ మ్యాచ్‌లో 'దోస ఇడ్లీ' పాటతో మరో రచ్చ

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య జరిగిన మ్యాచ్ కొత్త వివాదానికి తెరలేపింది. ఈ మ్యాచ్ సందర్భంగా స్టేడియం డీజే వ్యవహరించిన తీరుపై చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కి సీఎస్‌కే అధికారికంగా ఫిర్యాదు చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అసలేం జరిగింది? వివాదానికి కారణమైన ఆ పాట ఏంటి?
Image Credit : Google

అసలేం జరిగింది? వివాదానికి కారణమైన ఆ పాట ఏంటి?

చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో డీజే "దోస, ఇడ్లీ, సాంబార్, చట్నీ, చట్నీ" అనే వైరల్ సాంగ్‌ను ప్లే చేశారు. సాధారణంగా సోషల్ మీడియాలో దక్షిణాది వారిని గేలి చేయడానికి, మీమ్స్ చేయడానికి ఈ పాటను ఎక్కువగా వాడుతుంటారు. ఈ పాటను ప్లే చేయడం తమను కించపరచడమేనని సీఎస్‌కే భావిస్తోంది. ఇది ఏమాత్రం గౌరవప్రదంగా లేదని, ప్రత్యర్థి జట్టును తక్కువ చేసి చూపేలా ఉందని సీఎస్‌కే తన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ విచారణ జరుపుతోందని ఒక టాప్ ఐపీఎల్ అధికారి ధృవీకరించారు.

Related Articles

Related image1
Virat Kohli : ఏమైనా తగ్గేదేలే.. కింగ్ కోహ్లీకి ఏమైంది? షాకింగ్ నిజాలు !
Related image2
Raining Fish : ఆకాశం నుంచి చేపల వర్షం.. 150 ఏళ్లుగా వీడని వింత మిస్టరీ !
35
సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్ ఏమన్నారంటే?
Image Credit : Google

సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్ ఏమన్నారంటే?

ఈ వివాదంపై సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పందిస్తూ.. "సాధారణంగా స్టేడియంలో ఉండే డీజేలు హోమ్ టీమ్‌కు సపోర్టుగా ఉంటారు. కానీ చిన్నస్వామి స్టేడియంలో పరిస్థితి భిన్నంగా ఉంది. మా ఆటగాళ్లపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, దీనిపై విచారణ జరపాలని మేము బీసీసీఐకి లేఖ రాశాం" అని పేర్కొన్నారు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం డీజే పని కాదని ఆయన స్పష్టం చేశారు.

45
గతంలోనూ ఇదే తరహా వివాదం
Image Credit : ANI

గతంలోనూ ఇదే తరహా వివాదం

గాయకుడు గానా అప్పు కంపోజ్ చేసిన ఈ పాట గతంలోనూ వివాదాలకు కేంద్రబిందువైంది. గత ఏడాది ఆర్‌సీబీ తన సోషల్ మీడియాలో జితేష్ శర్మ ఈ పాట పాడుతున్న వీడియోను పోస్ట్ చేసింది. అప్పట్లో సీఎస్‌కే అభిమానులు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఘటన తర్వాత ఇలాంటివి మళ్లీ జరగకూడదని సీఎస్‌కే మేనేజ్‌మెంట్ భావించింది. కానీ, ఏప్రిల్ 5న జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే బ్యాటర్లు అవుట్ అయినప్పుడు డీజే చేసిన వ్యాఖ్యలు మంట పుట్టించాయి. ప్రత్యర్థిని అవమానించడం డీజే బాధ్యత కాదని సీఎస్‌కే అధికారి ఒకరు మండిపడ్డారు.

55
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో టాప్ ఎవరు?
Image Credit : Google

ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో టాప్ ఎవరు?

ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్‌సీబీ అదరగొడుతోంది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటిని గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. లక్నో సూపర్ జెయింట్‌పై విజయం సాధించి ఆర్‌సీబీ మంచి ఊపు మీద ఉంది. మరోవైపు, సీఎస్‌కే పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉంది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలతో 4 పాయింట్లు సాధించి ఎనిమిదో స్థానంలో ఉంది. అయితే, కోల్‌కతా నైట్ రైడర్స్‌పై వరుసగా రెండో విజయం సాధించి ఇప్పుడిప్పుడే సీఎస్‌కే ఫామ్‌లోకి వస్తోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
బెంగళూరు

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image2
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Recommended image3
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Related Stories
Recommended image1
Virat Kohli : ఏమైనా తగ్గేదేలే.. కింగ్ కోహ్లీకి ఏమైంది? షాకింగ్ నిజాలు !
Recommended image2
Raining Fish : ఆకాశం నుంచి చేపల వర్షం.. 150 ఏళ్లుగా వీడని వింత మిస్టరీ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved