MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • మధ్యాహ్నం పూట గుడికి ఎందుకు వెళ్లకూడదు?

మధ్యాహ్నం పూట గుడికి ఎందుకు వెళ్లకూడదు?

ప్రతిరోజూ గుడికి వెళ్లి దేవుడికి పూజా చేయాలని పురాణాలు వెల్లడిస్తున్నాయి. గుడికి వెళ్లి దేవుడికి దండం పెట్టుకోవడం వల్ల జీవితంలోని కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. అయితే ఎవ్వరైనా సరే మధ్యాహ్నం పూట గుడికి వెళ్లకూడదనే నియమం ఉంది. ఎందుకో తెలుసా?  

1 Min read
Shivaleela Rajamoni
Published : Mar 23 2024, 10:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ప్రతిరోజూ గుడికి వెళ్లి దేవుడిని దర్శించుకోవాలని శాస్త్రాల్లో చెప్పబడింది. గుడికి వెళ్లడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెప్తారు. గుడికి వెళ్లడం వల్ల జీవితంలో ఆనందం ఉంటుంది. దేవుడి ఆశీస్సులు మనపై ఉండాలి. సద్గుణాలు పెరుగుతాయని పండితులు చెప్తారు. అయితే గుడికి ఎప్పుడూ కూడా ఉదయం, సాయంత్రం వేళల్లోనే వెళ్లాలని పురాణాల్లో పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితిలో మధ్యాహ్నం  పూట గుడికి వెళ్లకూడదంటారు జ్యోతిష్యులు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

25

మధ్యాహ్నం గుడికి ఎందుకు వెళ్లకూడదు? 

మధ్యాహ్నం గుడికి వెళ్లడం నిషిద్ధం వెనుక మూడు బలమైన కారణాలున్నాయంటారు జ్యోతిష్యులు. మొదటి కారణం.. మధ్యాహ్నం మన శరీరం సోమరిగా ఉంటుంది. మన మెదడు నిద్రమత్తులో ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో.. మధ్యాహ్నం సోమరితనం నిండిన మనస్సుతో దేవుడిని చూడకూడదంటారు.
 

35

రెండో కారణం.. మధ్యాహ్నం స్వామికి నిద్రించే సమయం. కాబట్టి చాలా దేవాలయాల తలుపులు మధ్యాహ్నానికి మూసివేయబడతాయి. మధ్యాహ్న పూట స్వామివారు గుడిలో సేదతీరుతారు. ఇలాంటి సమయంలో మీరు గుడికి వెళితే దేవుని నిద్రకు ఆటంకం కలుగుతుంది. 
 

45
Meenakshi Temple

Meenakshi Temple

పురాణాల ప్రకారం.. ఉదయం, సాయంత్రం పూటే ఆలయాన్ని సందర్శించేవాళ్లు మానవులు, పవిత్ర జీవులు. మధ్యాహ్నం దెయ్యాలు, పూర్వీకులు, తీరని ఆత్మల కాలమని నమ్ముతారు. ఇలాంటి సమయంలో స్వామి దర్శనం కోసం ఆలయంలో కనిపించని శక్తులు ఉంటాయి. వీళ్లకు బాధల నుంచి విముక్తి, మోక్షం లభిస్తుంది
 

55

మధ్యాహ్నం పూట గుడికి వెళ్లినప్పుడు మన కంటికి కనిపించని శక్తులకు, భగవంతుడికి మధ్య జరిగే సమావేశానికి ఆటంకం ఏర్పడుతుందని శాస్త్రాల్లో చెప్పబడింది. అందుకే మధ్యాహ్నం దేవాలయాలు తెరిచే ఉన్నప్పటికీ భక్తులు వెళ్లకూడదు.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved