Irumudi: ఇరుముడిలో ఏమేం పెడతారు? కొబ్బరికాయలో నెయ్యి ఎందుకు వేస్తారు?
Irumudi: అయ్యప్ప ఇరుముడి చాలా పవిత్రమైనది. మరి ఇరుముడి ప్రత్యేకత ఏంటీ? ఎందుకు కొబ్బరికాయలో నెయ్యి వేస్తారు? ఇరుముడి కట్టే అసలైన పద్ధతి గురించి ఇక్కడ తెలుసుకుందాం.

అందుకే నెయ్యి వేస్తారు
ఇరుముడి అంటే జంట ముడి. ముందర ముడి స్వామిది-అంటే పరమార్ధం. రెండో ముడి స్వార్థం. తల్లి పులి పాలు తెమ్మని చెప్పినప్పుడు...అయ్యప్ప బయలుదేరుతారు. అడవి గుండా వెళ్లినప్పుడు ఈ ఇరుముడి కట్టుకుని వెళ్లారని చెప్తారు. అందులో ఆయనకు ఇష్టమైన ఆవునెయ్యి కడతారు. అందుకే మనం కూడా ఇప్పుడు ఇరుముడి కట్టేటప్పుడు నెయ్యి వేస్తారు.
రెడీమెడ్గా కొనడం మంచిది కాదు
ఇరుముడి అనేది ఒక పూజ. కానీ ఇప్పుడు చాలా మంది రెడీమెడ్గా కొనేస్తున్నారు. అది మంచిది కాదని...అలా చేయడం వల్ల దీక్షకు అర్థం లేదంటున్నారు. కొబ్బరికాయలో నీళ్లు తీసి సాంబ్రాణి పొగ వేసి ఒక రాత్రంతా ఉంచుతారు. మరుసటి రోజు గురుస్వాములు ఆ కొబ్బరిలో నెయ్యి పోసి బిరడా మూసి తలపై పెడతారు.
ఈ నెయ్యితోనే అయ్యప్ప స్వామికి అభిషేకం
ముందుముడిలో ఈ నెయ్యి కొబ్బరికాయ ఉంచుతారు. శబరిమల చేరుకున్నాక ఈ నెయ్యితోనే అయ్యప్ప స్వామికి అభిషేకం చేస్తారు. పూజ సామానులు కూడా పెడతారు. కర్పూరం, అగర్బత్తీలు, కుంకుమ, పసుపు, స్వామివారికి పెట్టాల్సిన నైవేధ్యం...బెల్లం, ఎండుద్రాక్ష, అటుకులు, మిశ్రీ వంటివి పెడతారు.
భక్తుడి అవసరాల కోసం
వెనుకముడి అనేది భక్తుడి అవసరాల కోసం వేస్తారు. అందులో బియ్యం, కొన్ని రకాల ఆహారాలు ఉంటాయి. అక్కడ వండుకుని తినడానికి ఇవి ఉపయోగపడతాయి. శబరిమల చేరుకున్నాక పంబానదిలో స్నానం చేసి అక్కడ వదిలేయడానికి కొంతమంది ఒక జత పాతబట్టలు కూడా పెడతారంట.
దీక్ష చేసినా ఫలితం ఉండదు
ఇరుముడి మనిషి పాపపుణ్యాలకు ప్రతీక. అతనిలోని స్వార్థ గుణాలని వదిలేయడానికే ఈ ఇరుముడి కట్టుకుంటారు. 41 రోజులు దీక్ష చేసినవారే ఇరుముడి కట్టుకోవాలి. ఇరుముడి కట్టుకునేవారికే పవిత్ర 18 మెట్లు ఎక్కే అర్హత ఉంటుంది. గురుస్వాములు మాత్రమే ఈ ఇరుముడి కట్టాలి. దీక్ష తర్వాత కూడా శుచిగా ఉండాలి. లేకపోతే దీక్ష చేసినా ఫలితం ఉంటుందని చెప్తున్నారు.

