MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • వైకుంఠ ఏకాదశి: ఈ పనులు చేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి.. చేసిన పాపాలు నశిస్తాయి

వైకుంఠ ఏకాదశి: ఈ పనులు చేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి.. చేసిన పాపాలు నశిస్తాయి

వైకుంఠ ఏకాదశిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ రోజు శ్రీమహావిష్ణువును, శ్రీ కృష్ణుడిని నిష్టగా పూజిస్తారు. అయితే ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే ఇంట్లో సుఖశాంతులు, ఆనందం నెలకొంటాయని నమ్ముతారు. అయితే ఈ రోజు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి. 

2 Min read
Shivaleela Rajamoni
Published : Jan 10 2025, 10:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Vaikuntha Ekadashi

Vaikuntha Ekadashi

సంవత్సరకాలంలో ఎన్నో ఏకాదశులు వస్తుంటాయి. పోతుంటాయి. కానీ వీటన్నింటిలో వైకుంఠ ఏకాదశిని ఎంతో పవిత్రంగా, అత్యంత ముఖ్యమైందిగా పరిగణిస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించి భక్తులు నిష్టగా ఉపవాసం ఉంటారు. ఈ దేవుడి అనుగ్రహం ఉంటే జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. 

25

శాస్త్రాల ప్రకారం.. వైకుంఠ ఏకాదశి నాడు కఠినమైన ఉపవాసం ఉండి, నియమాల ప్రకారం.. పూజ చేసిన వారికోసం విష్ణువుమూర్తి వైకుంఠ ద్వారాలను తెరుస్తాడని చెప్తారు. అంతేకాదు వీరు తెలిసీ, తెలియక చేసిన పాపాలు కూడా నశిస్తాయట. పంచాంగం ప్రకారం.. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి ఈరోజున అంటే జనవరి 10 జరుపుకుంటున్నాం. అందుకే ఈ పవిత్రమైన రోజుకు సంబంధించిన కొన్ని నియమాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

35

వైకుంఠ ఏకాదశి నాడు ఈ పని ఖచ్చితంగా చేయండి 

ఉపవాసం: ముక్కోటి లేదా వైకుంఠ ఏకాదశి ఉపవాసం నాడు సాత్విక్తాన్ని పాటించాలి. అలాగే తామసిక పదార్థాలు వేసిన ఏ ఆహారాలను తినకూడదు. అలాగే మీరు ఈ ఉపవాసాన్ని ద్వాదశి తిథి నాడు మాత్రమే విరమించాల్సి ఉంటుంది. .

పూజలు:  ముక్కోటి ఏకాదశి ఉపవాసం ఉండేవారు పొద్దున్నే నిద్రలేచి, పవిత్ర స్నానం చేయాలి. అలాగే నిష్టగా పూజలు చేయాలి. వీటితో పాటుగా ఉపవాసం కథను కూడా పారాయణం చేయాలని పండితులు చెబుతున్నారు. 

45

మంత్రాల జపం:  వైకుంఠ ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువు వేద మంత్రాలను పఠిస్తే పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. పూజా ఫలం దక్కాలంటే ఈ రోజున మీరు ఖచ్చితంగా శ్రీ హరి నామాలను జపించండి.

ఆలయాన్ని సందర్శించండి: పవిత్రమైన ముక్కోటి ఏకాదశి నాడు విష్ణువు ఆలయాన్ని ఖచ్చితంగా సందర్శించండి. పూజలు, ప్రార్థనలు చేయండి. అలాగే పేదలకు అవసరమైన ఆహారం, వెచ్చని దుస్తులు వంటి వాటిని దానం చేయండి. మీకు పుణ్యం దక్కుతుంది. అలాగే మీకు శాంతి, ఆనందం కలుగుతాయి. 

55

వైకుంఠ ఏకాదశి శుభ యోగం 

హిందూ క్యాలెండర్ ప్రకారం..  శుభ యోగం ఉదయం నుంచి మధ్యాహ్నం 02:37 వరకు ఉంటుంది. సంధ్యా ముహూర్తం సాయంత్రం 05:40 నుంచి 06:07 వరకు ఉంటుంది. అలాగే అభిజీత్ ముహూర్తం మధ్యాహ్నం 12:08 నుంచి 12:48 వరకు ఉంటుంది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved