MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Spiritual
  • నవరాత్రుల్లో మూడో రోజు.. పూజ సమయంలో ఈ కథను వింటే చంద్రఘంటా దేవి అనుగ్రహం లభిస్తుంది

నవరాత్రుల్లో మూడో రోజు.. పూజ సమయంలో ఈ కథను వింటే చంద్రఘంటా దేవి అనుగ్రహం లభిస్తుంది

navratri 2023: నవరాత్రుల్లో మూడో రోజు చంద్రఘంటదేవిని పూజిస్తారు. ఈ రోజు మాతను భక్తిశ్రద్ధలతో పూజిస్తే భక్తుల కోరికలన్నీ వీలైనంత త్వరగా నెరవేరుతాయని నమ్ముతారు. అలాగే ఇంట్లో సుఖసంతోషాలు, సౌభాగ్యాలు కలుగుతాయి. చంద్రఘంటదేవి అనుగ్రహం పొందాలంటే ఆ తల్లిని సక్రమంగా ఆరాధించండి. అలాగే పూజ సమయంలో వ్రత కథను ఖచ్చితంగా పఠించాలని పండితులు చెబుతున్నారు. 

2 Min read
Author : R Shivallela
| Updated : Oct 17 2023, 09:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

navratri 2023: నవరాత్రుల్లో మూడో రోజు చంద్రఘంట దేవిని పూజిస్తారు. అలాగే ఉపవాసం కూడా ఉంటారు. తల్లి ప్రేమ సముద్రం అని సనాతన శాస్త్రాల్లో ఉంది. ఈ దేవత మహిమ అద్వితీయమైనది. ఆమె తన భక్తులను ఎల్లవేళలా కాపాడుతుంది. అలాగే దుష్టులను చంపుతుంది. శారదా నవరాత్రులలో మూడో రోజు చంద్రఘంటదేవిని భక్తిశ్రద్ధలతో  పూజిస్తారు. దీంతో మన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం. అంతేకాదు ఇంట్లో సుఖసంతోషాలు, సౌభాగ్యాలు కూడా కలుగుతాయి. అయితే చంద్రఘంట దేవి అనుగ్రహం పొందాలంటే పూజ సమయంలో వ్రత కథను ఖచ్చితంగా పఠించాలంటున్నారు పూజారులు.  ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

వ్రత కథ

ప్రాచీన కాలంలో మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఇతన భయంకరమైన వాడు. ఇతని భయం ములోకాల్లో కలకలం రేపింది. భగవంతుడు ప్రసాదించిన అజేయ శక్తితో మహిషాసురుడు ఎంతో శక్తివంతుడయ్యాడు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ స్వర్గంపై పెత్తనం చెలాయించేవాడు. మహిషాసురుడి రాక్షస చేష్టలకు స్వర్గ దేవతలు కూడా ఎంతో భయభ్రాంతులకు గురయ్యారు. స్వర్గపు రాజు ఇంద్రుడు కూడా ఎంతో భయానికి లోనయ్యాడు. రాక్షసుడు మహిషాసురుడు స్వర్గ సింహాసనాన్ని అధిష్టించాలనుకుంటాడు. 
 

 

35

ఆ సమయంలో దేవతలందరూ బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి సహాయం కోరుతారు. బ్రహ్మదేవుడు ఇలా అంటాడు.. ‘ప్రస్తుత కాలంలో మహిషాసురుడిని ఓడించడం అంత సులభం కాదు. దీనికోసం మనమందరం పరమేశ్వరుడి దగ్గరకు వెళ్లాలి. దీంతో దేవతలందరూ మొదటగా లోక సంరక్షకుడైన విష్ణువు వద్దకు వెళ్లి ఆయన సమ్మతితో పరమేశ్వరుడిని కలవడానికి కైలాసానికి చేరుకుంటారు. ఇంద్రుడు మహిషాసురుడి రాక్షస చేష్టలన్నింటినీ శంకరుడికి వివరిస్తాడు. ఇంద్రుడి మాటలను విన్న మహాదేవుడు ఆగ్రహించి.. మహిషాసురుడు తన శక్తిని తప్పుడు మార్గంలో ఉపయోగిస్తున్నాడు. ఇందుకు అతనికి కచ్చితంగా శిక్ష పడుతుందని అంటాడు.

 

45

ఆ సమయంలో మహావిష్ణువు, బ్రహ్మదేవుడికి కూడా కోపం వస్తుంది. వీళ్ల కోపం నుంచి తేజస్సు ఒక తేజస్సు కనబడుతుంది. ఆ శక్తి వాళ్ల నోటి నుంచి బయటకు వస్తుంది. ఆ శక్తితోనే ఒక దేవత ప్రత్యక్షమవుతుంది. ఈ సమయంలో శివుడు తన త్రిశూలాన్ని అమ్మవారికి ఇస్తాడు. మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రసాదిస్తాడు. ఇంద్రుడు ఆ సమయాన్ని ఇస్తాడు. ఈ విధంగా దేవతలందరూ తమ ఆయుధాలను అమ్మవారికి ఇస్తారు.

55

అప్పుడు చంద్రఘంట దేవి త్రిమూర్తుల అనుమతి తీసుకొని మహిషాసురుడితో యుద్దానికి సిద్ధమవుతుంది. కాలక్రమేణా చంద్రఘంట దేవి మహిషాసురుడికి మధ్య భీకర యుద్ధం జరిగిందని పురాణాల్లో ఉంది. ఈ యుద్ధంలో మహిషాసురుడు చంద్రఘంటికదేవి ముందు నిలబడలేకపోయాడు. ఆ సమయంలో మహిషాసురుడిని వధించి తల్లి ముల్లోకాలను కాపాడింది. తల్లి రోదనలు ముల్లోకాల్లో ప్రతిధ్వనించాయి. రాక్షసుడి నుంచి మూడు లోకాలను కాపాడినందుకు చంద్రఘంటిక దేవతను ప్రతి ఒక్కరూ పూజిస్తారు. అమ్మవారు తన భక్తుల దుఃఖాలన్నిటినీ జయిస్తుంది. అలాగే ఆనందం, శ్రేయస్సు , శాంతిని కూడా అందిస్తుంది. అందుకే శారదా నవరాత్రులలో మూడో రోజు భక్తులు చంద్రఘంట దేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.

About the Author

RS
R Shivallela

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved