MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • దీపావళికి మాత్రమే తెరిచే ఆలయం గురించి విన్నారా? ఇది ఎక్కడుందంటే?

దీపావళికి మాత్రమే తెరిచే ఆలయం గురించి విన్నారా? ఇది ఎక్కడుందంటే?

ఏ దేవాలయంలో అయినా ప్రతి రోజు పూజలు చేస్తారు కదా.. కాని ఈ టెంపుల్ ను దీపావళికి మాత్రమే తెరిచి పూజలు చేస్తారు. మిగిలిన రోజులన్నీ ఈ ఆలయం మూసే ఉంటుంది. అయితే పూజల సమయంలో ఆలయంలో పెట్టిన దీపం, అలంకరించిన పువ్వులు మళ్లీ వచ్చే దీపావళి రోజు వరకు తాజా ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రత్యేకమైన ఆలయం ఎక్కడ ఉంది. దీపావళికే ఎందుకు తెరుస్తారు? ఇక్కడ జరిగే ప్రత్యేక పూజలు ఏంటి? ఇలాంటి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.  

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Oct 26 2024, 09:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మన దేశంలో బడి లేని ఊరు ఉంటుందేమో కాని గుడి లేని ఊరు ఉండదంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఆలయంలో నిత్యం అర్చకులు పూజలు చేస్తారు. భక్తులు కూడా దేవతా విగ్రహాలను దర్శించి పూజలు చేయించుకుంటారు. కాని ఇండియాలోనే కొన్ని ఆలయాలు కేవలం ప్రత్యేక సందర్భాల్లో తెరుస్తారు. ఉదాహరణకు శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం సంవత్సరంలో నవంబర్ నుంచి జనవరి వరకు మాత్రమే భక్తుల దర్శనార్థం తెరుస్తారు. తర్వాత మూసి వేస్తారు. 

 ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో ఉన్న అలకనంద తీరంలో ఉన్న బదరీనాథ్ క్షేత్రాన్ని ఆరు నెలలు మాత్రమే తెరచి ఉంచుతారు. మిగిలిన ఆరు నెలలు మంచు కారణంగా మూసి ఉంచుతారు.    

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

అలాంటి ప్రత్యేక ఆలయాల జాబితాలో ఉన్న క్షేత్రమే హాసనంబ ఆలయం. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. బెంగళూరుకు 180 కి.మీ. దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని12వ శతాబ్దంలో నిర్మించారు. గతంలో సింహాసనపురి అని పిలిచేవారని పురాణాల్లో ఉంది. ఈ క్షేత్రం గురించి అనేక ఇతిహాసాల్లో ప్రస్తావన ఉందని చెబుతారు.

హాసనాంబ ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని హసన్ పట్టణంలో ఉన్న ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయంలో దుర్గాదేవి కొలువై ఉంటుంది. పలు ప్రాచీన కథలు, జానపద విశ్వాసాలతో ఈ ఆలయం ఎంతో ప్రాచుర్యం పొందింది. హాసనాంబ దేవిని దర్శిస్తే కోరికలు నెరవేరుతాయని ఆ ప్రాంత ప్రజల విశ్వాసం. 

 

35

హాసనాంబ ఆలయ చరిత్ర 12వ శతాబ్దం నాటిది. హోయసల రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. హాసన్ పట్టణానికి ఈ ఆలయంతోనే పేరు వచ్చింది. ఇక్కడ అమ్మవారు అగ్ని రూపంలో ఉంటుందని నమ్మకం. ఈ ఆలయానికి వెళ్లాలంటే హసన్ పట్టణం వరకు రైలు, బస్సు, రోడ్ ద్వారా చేరుకోవచ్చు. బెంగళూరు నుంచి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. హాసనాంబ దేవతకు లడ్డూ, కడలె ప్రసాదం నైవేద్యంగా  సమర్పిస్తారు. ఈ ఆలయం వద్ద మంత్రోచ్ఛారణ, స్మరణ, మంత్రజపం వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా ఆలయం తెరచి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలు పది రోజులపాటు జరుగుతాయి. ఈ సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాన్ని దర్శించుకుంటారు. ఈ సంవత్సరం 24 గంటలూ హాసనంబ దేవి దర్శనం చేసుకోవచ్చు. ఆ విధంగా కర్ణాటక ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. భక్తులు ఎలాంటి ఆటంకాలు లేకుండా దర్శనం చేసుకోవచ్చు.

హాసన్ పట్టణానికి అధిష్టాన దేవత అయిన హాసనంబ దేవి ఉత్సవాలు అక్టోబర్ 24 నుంచి ప్రారంభమయ్యాయి. ఇవి నవంబర్ 3 వరకు జరుగుతాయి. ఈ పది రోజుల్లో భక్తులు అమ్మవారిని దర్శించుకోవచ్చు. మళ్లీ ఆలయం వచ్చే ఏడాది దీపావళి వరకు మూసి వేస్తారు.

45

హాసనంబ ఆలయం ప్రత్యేకత

దీపావళి సందర్భంగా తెరిచి ఉత్సవాలు నిర్వహించే ఈ ఆలయం తర్వాతి సంవత్సరం వరకు మూసివేస్తారు. అప్పటి వరకు వెలిగించిన దీపాలు, పువ్వులు, నైవేద్యాలు ఏడాది పాటు తాజాగా ఉంటాయని భక్తులు చెబుతారు. ఆలయం మూసి వేసేటప్పుడు ఒక నెయ్యి దీపం వెలిగిస్తారు. గర్భగుడిని పువ్వులు, బియ్యం నైవేద్యాలతో అలంకరిస్తారు. ఇవి ఒక సంవత్సరం తర్వాత కూడా తాజాగా ఉంటాయని స్థానికులు చెబుతారు. ఈ వింతను చూసేందుకు భక్తులు తరలి వస్తారు. 

55

ఆలయ పురాణం ఇది..

అంధకాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేస్తారు. అనుగ్రహించిన పరమేశ్వరుడు వరం కోరుకోమని కోరగా తనకు అదృశ్య శక్తి కావాలని కోరతాడు. శివుడు అనుగ్రహించడంతో అప్పటి నుంచి అదృశ్యంగా ప్రజలను, దేవతలను బాధపెడుతూ ఉంటాడు. దీంతో అతడిని సంహరించాలని శివుడు నిశ్చయించుకుంటాడు. యోగేశ్వరి దేవి అనే అమ్మవారిని పుట్టించి రాక్షసుడిని సంహరింపజేస్తాడు. అంధకాసురుడి సంహారం తర్వాత అమ్మవారు హాసనాంబ ఆలయంలో అగ్ని రూపంలో కొలువై ఉంది. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
దీపావళి

Latest Videos
Recommended Stories
Recommended image1
Vastu Plants: ఇంట్లో ఈ మొక్కలు పెంచితే.. చేతిలో పైసా నిలవదు.. అన్నీ అశుభాలే!
Recommended image2
Somnath Temple Mystery: మహాశివుని మొదటి జ్యోతిర్లింగం.. సోమనాథ్ ఆలయం వెనుక ఉన్న ఆ మిస్టరీ ఏంటో తెలుసా?
Recommended image3
Pooja Room Vastu: పూజ గదిలో ఈ 5 చేస్తే నష్టాలు తప్పవు జాగ్రత్త!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved