Garuda Puranam: గరుడ పురాణం ప్రకారం చనిపోయే ముందు వచ్చే సంకేతాలెంటో తెలుసా?
హిందూమతంలో గరుడ పురాణానికి చాలా ప్రాధాన్యం ఉంది. పుట్టుక నుంచి చావు వరకు గరుడ పురాణంలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ పురాణం ప్రకారం, ఒక వ్యక్తి మరణించే ముందు కొన్ని సంకేతాలు వస్తాయట. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
సనాతన ధర్మం ప్రకారం గరుడ పురాణం వ్యక్తి మరణం తర్వాత వినాలని అంటారు. ఈ పురాణం మరణం తర్వాత వ్యక్తి ప్రయాణాన్ని వివరిస్తుంది. గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి మరణానికి ముందు కొన్ని సంకేతాలు వస్తాయట. చావబోయే ఒక గంట ముందు కనిపించే 5 సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కర్మలను గుర్తు చేసుకుంటారు
గరుడ పురాణం ప్రకారం, ఒక వ్యక్తి చావుకు దగ్గరగా ఉన్నప్పుడు వారు తమ జీవితంలో చేసిన అన్ని కర్మలను గుర్తు చేసుకుంటారు. పాత విషయాల గురించి మాట్లాడటం ప్రారంభిస్తారు. తాను చేసిన మంచి, చెడు పనుల గురించి కుటంబ సభ్యులతో పంచుకుంటారు.
రహస్యమైన తలుపు
గరుడ పురాణం ప్రకారం చావు సమీపిస్తుండగా ఒక వ్యక్తి రహస్యమైన తలుపును చూడటం ప్రారంభిస్తాడు. అంతే కాదు వారికి రహస్యమైన తలుపు కనిపిస్తుందని కుటుంబ సభ్యులకు చెప్తుంటారు కూడా. దీంతో పాటు మరికొందరు తమ చుట్టూ మంటలను చూడటం ప్రారంభిస్తారు.
యమ దూతలు
గరుడ పురాణం ప్రకారం, చావు సమీపిస్తున్నప్పుడు, యమ దూతలు కొంత సమయం ముందు కనిపించడం ప్రారంభిస్తారు. వ్యక్తి ఎల్లప్పుడూ తన చుట్టూ కొన్ని ప్రతికూల శక్తి ఉనికిని అనుభవిస్తాడు.
పూర్వీకులు కనిపిస్తారు
గరుడ పురాణం ప్రకారం, పూర్వీకులు చనిపోయే కొన్ని రోజుల ముందు వ్యక్తి కలలో కనిపిస్తారు. కొంతమంది తమ పూర్వీకులు తమ కలలో దుఃఖంగా లేదా ఏడుస్తూ ఉండటం చూస్తారు. ఇది చావు దగ్గరలో ఉందని సూచిస్తుంది.
చేతిపై గీతలు
గరుడ పురాణం ప్రకారం, చావు దగ్గర పడినప్పుడు, వ్యక్తి చేతిపై గీతలు అకస్మాత్తుగా మసకబారడం ప్రారంభిస్తాయి. అలాంటి సమయంలో, కొంతమంది చేతులపై గీతలు కనిపించకుండా పోవచ్చని గరుడ పురాణంలో పేర్కొనబడింది.