MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • మహా కుంభమేళా 2025 - భక్తులకు హెచ్చరికలు !

మహా కుంభమేళా 2025 - భక్తులకు హెచ్చరికలు !

Mahakumbh 2025: 45 రోజుల పాటు సాగే "ప్రయాగ్ రాజ్ మహాకుంభ్ 2025" ఉత్సవం సమీపిస్తున్న క్రమంలో హోటళ్ళు, ధర్మశాలలు, గెస్ట్ హౌస్‌లు, టెంట్ సిటీ కుటీరాలతో సహా వసతి కోసం మోసపూరిత బుకింగ్‌లతో ఆన్ లైన్ మోసాలు జరిగే అవకాశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం హెచ్చరించింది.

3 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Apr 07 2025, 11:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

2025 జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్‌రాజ్‌లో జరగనున్న మహా కుంభమేళాకు మన దేశంలోని చాలా ప్రాంతాలతో పాటు విదేశాల నుండి చాలా మంది భక్తులు వస్తారని భావిస్తున్నారు. అయితే, ఈ గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం ఉత్సాహం పెరుగుతున్న కొద్దీ, అమాయక యాత్రికులను ఆన్‌లైన్ మోసగాళ్ళు టార్గెట్ చేస్తున్నారని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఆన్ లైన్ మోసాలు, ఇతర మోసపూరిత చర్యల గురించి హెచ్చరిస్తూ భక్తుల కోసం పలు భద్రతాపరమైన చర్యలను ప్రస్తావించింది.

28

మోసపూరిత బుకింగ్‌లు పెరుగుతున్నాయి: 

45 రోజుల పాటు సాగే ప్రయాగ్ రాజ్ మహా కుంభ్ 2025 కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే ఉత్సవం సమీపిస్తున్న కొద్దీ, మోసగాళ్ళు హోటళ్ళు, ధర్మశాలలు, గెస్ట్ హౌస్‌లు, టెంట్ సిటీ కుటీరాలతో సహా వసతి కోసం మోసపూరిత బుకింగ్‌లను అందిస్తూ సందర్శకుల నుంచి దోపిడీకి తెరలేపారు. ముంబైలో ఇటీవల జరిగిన సంఘటన పెరుగుతున్న ముప్పును హైలైట్ చేస్తుంది. 

38

అంధేరీ వెస్ట్‌కు చెందిన 75 ఏళ్ల వ్యక్తి మహా కుంభమేళాకు టిక్కెట్లు, వసతిని బుక్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు రూ.1 లక్షలు కోల్పోయాడు. తన భార్య, కుమార్తెతో కలిసి పవిత్ర కార్యక్రమానికి హాజరు కావాలనుకున్న బాధితుడు టెంట్ బుకింగ్‌లను ప్రకటించే నకిలీ వెబ్‌సైట్‌కు బలయ్యాడు. ఇచ్చిన నంబర్‌కు కాంటాక్ట్ చేసిన తర్వాత, ముగ్గురు నివాసం ఉండటానికి టెంట్ కోసం RTGS ద్వారా రూ.14,000 బదిలీ చేశాడు.

48

ఈ మోసం అక్కడితో ఆగలేదు. ట్రావెల్ ఏజెంట్లుగా నటించిన మోసగాళ్ళు అతని ప్రయాణ ప్రణాళికల గురించి విచారించి, ముంబై నుండి ప్రయాగ్‌రాజ్‌కు రౌండ్ ట్రిప్ టిక్కెట్లను రూ. 89,000కి ఏర్పాటు చేస్తామని ఆఫర్ చేశారు. మోసగాళ్లను నమ్మి బాధితుడి కుమారుడు చెల్లింపు చేశాడు. రసీదు జారీ చేసినప్పటికీ, వాగ్దానం చేసిన టిక్కెట్లు రాలేదు. ప్రశ్నించినప్పుడు, మోసగాళ్ళు 72 గంటల ఆలస్యం అవుతుందని చెప్పారు, ఆ తర్వాత వారి ఫోన్ నంబర్‌లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. 

58

వెబ్‌సైట్‌లు, ఏజెంట్ల ప్రామాణికతను ధృవీకరించుకోవాలి

దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితులు పోలీసులకు జరిగిన విషయం గురించి చెప్పారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఆన్‌లైన్ లావాదేవీలు చేసే ముందు వెబ్‌సైట్‌లు, ఏజెంట్ల ప్రామాణికతను ధృవీకరించాలని అధికారులు ప్రజలను కోరారు. ప్రభుత్వం అందిస్తున్న సర్వీసులను ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు. అలాగే, ఆన్ లైన్ ద్వారా పొందే సేవల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. మీకు సేవలు అందించే వారి గురించి తగిన సమాచారం అందిన తర్వాత ముందుకు సాగాలని చెబుతున్నారు.

68

పోలీసులు, సైబర్ క్రైమ్ యూనిట్ల చర్యలు 

ఇటువంటి మోసాలను ఎదుర్కోవడానికి, ఉత్తరప్రదేశ్ పోలీసులు బాలీవుడ్ నటుడు సంజయ్ మిశ్రా నటించిన ప్రజా అవగాహన వీడియోను విడుదల చేశారు. వీడియోలో, యాత్రికులు అధికారిక మహా కుంభమేళా వెబ్‌సైట్ kumbh.gov.in ద్వారా మాత్రమే వసతికి సంబంధించిన సేవలు పొందడానికి బుక్ చేసుకోవాలనీ, సందేహాస్పద ఆఫర్‌లను నివారించాలని మిశ్రా సలహా ఇచ్చారు. భక్తులు సురక్షితమైన బుకింగ్‌లు చేసుకోవడానికి అధికారం కలిగిన హోటళ్ళు, గెస్ట్ హౌస్‌ల జాబితా కూడా ప్రచురించబడింది.

ప్రయివేటు సంస్థల నుంచి మహా కుంభ్ 2025కు రావడానికి, ఇక్కడ సేవలు పొందడానికి సంబంధించి ప్రభుత్వ సంస్థల సేవలను ఉపయోగించుకోవాలని యూపీ సర్కారు పేర్కొంటున్నది. ప్రయివేటు వెబ్ సైట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ kumbh.gov.in నుంచి సేవలను పొందాలని పేర్కొన్నారు.

78

ఇదిలావుండగా, ప్రభుత్వ అధికారులు మహాకుంభ్ 2025 కోసం సేవలను అందించే ప్రయివేటు సంస్థల విషయంలో చర్యలు తీసుకుంటున్నారు. పింప్రి చించ్వాడ్‌లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ మహా కుంభమేళా కోసం బుకింగ్‌లు, విరాళాలను కోరుతూ మోసపూరిత వెబ్‌సైట్‌లకు వ్యతిరేకంగా నోటీసులు జారీ చేశారు. అలాంటి వాటిపై చర్యలు తీసుకుంటున్నారు. భక్తుల నమ్మకాన్ని దోపిడీ చేసేందుకు రూపొందించిన నకిలీ లింక్‌లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల పెరుగుదలను గుర్తించిన అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

88

యాత్రికులకు భద్రత చిట్కాలు:

అధికారిక వనరులను ఉపయోగించండి: అధికారిక మహా కుంభమేళా వెబ్‌సైట్ లేదా అధికారిక భాగస్వాముల ద్వారా మాత్రమే వసతిని బుక్ చేసుకోండి.
కాంటాక్ట్ వివరాలను ధృవీకరించండి: ఏజెంట్లతో సంప్రదించే ముందు ఫోన్ నంబర్‌లు, ఇమెయిల్ చిరునామాలను క్రాస్-చెక్ చేయండి.
ఆఫర్‌ల విషయంలో జాగ్రత్త: అసాధారణంగా చౌకగా అనిపించే లేదా తక్షణ చెల్లింపులు అవసరమయ్యే ఒప్పందాలను నివారించండి. మరీ ముఖ్యంగా పెద్దపెద్ద ఆఫర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
సలహాలు, నోటీసులు: స్థానిక పోలీసులు, సైబర్ క్రైమ్ యూనిట్లు జారీ చేసి సూచనలు, హెచ్చరికలను ఫాలో అవ్వండి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు గంట‌లో వెళ్లిపోవ‌చ్చు.. దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్‌లో మ‌రో కీల‌క అడుగు
Recommended image2
Now Playing
విజయ సంకల్ప యాత్రలో మోదీ స్పీచ్ కి దద్దరిల్లిన సభ | PM Narendra Modi Speech | Asianet News Telugu
Recommended image3
Now Playing
PM Narendra Modi Speech in Dum Dum: వెస్ట్ బెంగాల్ సభలో మోదీ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved