MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • మ‌హారాష్ట్ర లో ఘోర రైలు ప్ర‌మాదం.. డ‌జ‌న్ల మంది మృతి

మ‌హారాష్ట్ర లో ఘోర రైలు ప్ర‌మాదం.. డ‌జ‌న్ల మంది మృతి

Jalgaon Train Accident: మహారాష్ట్రలోని జలగావ్ లో పుష్పక్ ఎక్స్‌ప్రెస్ కోచ్ లో మంట‌లు చెల‌రేగాయ‌నే వ‌దంతుల‌తో చాలా మంది ప్రయాణికులు మంటల భయంతో ప‌క్క‌ రైల్వే ట్రాక్‌పైకి దూకారు. 

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 22 2025, 06:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

Jalgaon Train Accident: మ‌హారాష్ట్రలోని  జ‌ల‌గావ్  జిల్లాలో ఘోర రైలు ప్ర‌మాదం జ‌రిగింది. పుష్పక్ ఎక్స్‌ప్రెస్ కోచ్ లో మంట‌లు చెల‌రేగాయ‌నే వ‌దంతుల‌తో చాలా మంది ప్రయాణికులు మంటల భయంతో చైన్ లాగి ప‌క్క‌ రైల్వే ట్రాక్‌పైకి దూకారు. అయితే, ఆ ట్రాక్ పై వ‌స్తున్న మ‌రో రైలు ప్ర‌యాణికుల‌ను ఢీ కొట్టింద‌ని ప్రాథ‌మిక నివేదిక‌లు పేర్కొంటున్నాయి. దీంతో పెద్ద సంఖ్య‌లో ప్రాణాలు కోల్పోయార‌ని స‌మాచారం.

24

స్ఠానిక మీడియా నివేదిక‌ల ప్ర‌కారం.. జలగావ్‌లోని పరండా రైల్వే స్టేషన్‌ సమీపంలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. పుష్పక్ ఎక్స్‌ప్రెస్ కోచ్ నుండి మంట‌లు వ‌చ్చానే వ‌దంతుల మ‌ధ్య ప్రయాణికులు మంటలకు భయపడి రైల్వే ట్రాక్‌పైకి దూకారు. అదే సమయంలో అటువైపు నుంచి వస్తున్న ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికులను ఢీకొట్టింది. చాలా మంది ప్రయాణికులు మరణించి ఉంటారని భావిస్తున్నారు.

34

జలగావ్‌లోని పరండా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు సమాచారం. పుష్పక్ ఎక్స్ ప్రెస్ నుంచి ఒక్కసారిగా మంట‌లు వ‌స్తున్నాయనే వ‌దంతుల మ‌ధ్య‌ ప్రయాణికుల్లో భయం నెలకొంది. కొందరు ప్రయాణికులు రైలు పట్టాలపైకి దూకారు. అదే సమయంలో రైలు పట్టాల నుంచి ఎదురుగా బెంగళూరు ఎక్స్‌ప్రెస్ వస్తోంది. రైల్వే ట్రాక్‌పై దిగిన కొంతమంది ప్రయాణికులను ఎక్స్‌ప్రెస్ ఢీ కొట్టింది. ఇందులో చాలా మంది మరణించి ఉంటారని భావిస్తున్నారు.

44

అందిన సమాచారం ప్రకారం పుష్పక్ ఎక్స్ ప్రెస్ ఒక్కసారిగా ఆగిపోయింది. దాంతో నిప్పురవ్వలు ఎగిరి పొగలు వచ్చాయి. ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయని కొందరు ప్రయాణికులు భావించారు. చాలా మంది భయంతో రైలు పట్టాలపైకి దూకారు. అదే సమయంలో బెంగళూరు ఎక్స్‌ప్రెస్ మరో ట్రాక్‌లో వెళ్తోంది. ఈ ఎక్స్‌ప్రెస్‌లో కొంతమంది ప్రయాణికులు మిస్సయ్యారు. చాలా మంది మరణించే అవకాశం ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు, రైల్వే సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Fake Universities : ఈ విద్యాసంస్థల్లో చేరారో అంతే సంగతి.. ఆంధ్ర ప్రదేశ్ లో ఫేక్ యూనివర్సిటీల కలకలం
Recommended image2
Love Marriage: లేచిపోయి పెళ్లి చేసుకునేవాళ్లకు షాక్.. ఇకపై పేరెంట్స్‌కు చెప్పకుండా పెళ్లి కుదరదు
Recommended image3
గ్రామాల రూపురేఖలే మారిపోతున్నాయి.. రూరల్ ఎకానమీ దిశగా కీలక ముందుడుగు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved