MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • ఇండియాలోనే చౌకైన ఏసీ రైలు ఇదే! టికెట్ ధర ఎంతో తెలుసా?

ఇండియాలోనే చౌకైన ఏసీ రైలు ఇదే! టికెట్ ధర ఎంతో తెలుసా?

సాధారణ రైలు టికెట్ ధరలే ఈ రైలులో వుంటాయి...కానీ ఏసి సదుపాయం వుంటుంది. ఇలా భారతదేశంలో అత్యంత చౌకైన ఏసీ రైలు ఏదో తెలుసా?

2 Min read
Author : Arun Kumar P
Published : Jan 18 2025, 10:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Indian Railway

Indian Railway

వందే భారత్, నమో భారత్, రాజధాని, శతాబ్ది వంటి రైళ్లు చాలా ప్రజాదరణ పొందాయి. సంవత్సరం పొడవునా ఈ రైళ్ల టిక్కెట్లకు గిరాకీ ఉంటుంది. ఈ రైళ్ల టిక్కెట్ ధరలు కొన్నిసార్లు విమాన టిక్కెట్లతో పోటీపడతాయి.

కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ రైలు దేశంలోనే అత్యంత చౌకైనది. కానీ స్పీడ్ విషయంలో ఇది వందే భారత్ రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే వేగంగా ఉంటుంది.

గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ భారతదేశంలో అత్యంత చౌకైన రైలు... అలాగే పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ (ఏసీ) రైలుగా ఇది ఖ్యాతి గడించింది. ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అతి తక్కువ టిక్కెట్ ధరను ఇందులోనే చూస్తాం. ఈ రైలు, రాజధాని, శతాబ్ది, వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లతో పోలిస్తే చాలా తక్కువ టికెట్ రేట్లను కలిగివుంటుంది. 

23
గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్

గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్

గరీబ్ రథ్ రైలు టిక్కెట్ ధర కిలోమీటరుకు 68 పైసలు మాత్రమే. ఇది బడ్జెట్‌కు ప్రాధాన్యత ఇచ్చే ప్రయాణికులకు అనువైన ఎంపిక. కుటుంబసమేతంగా ఈ రైలులో ప్రయాణించినా చాలా తక్కువ ఖర్చు అవుతుంది. అందువల్లే ఇది పేదవాడి రైలుగా గుర్తింపు పొందింది.

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చౌకైన ఏసీ ప్రయాణాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో 2006లో ప్రారంభించబడిన ఈ రైలు తొలి ప్రయాణం బీహార్‌లోని సహర్సా,. అమృత్‌సర్ మధ్య జరిగింది. నేడు గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ దేశవ్యాప్తంగా 26 మార్గాల్లో నడుస్తోంది. ఇది చాలా డిమాండ్‌ను కలిగి ఉంది. ప్రయాణికులు దీని టిక్కెట్లను పొందడానికి పోటీపడుతుంటారు..

33
చౌకైన రైలు

చౌకైన రైలు

వేగానికి వస్తే గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ ఇతర ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పోటీపడుతుంది. గరీబ్ రథ్‌తో సహా భారతీయ రైళ్ల సరాసరి వేగం గంటకు 66–96 కి.మీ మాత్రమే. గరీబ్ రథ్ నిరంతరం గంటకు సగటున 70–75 కి.మీ వేగంతో నడుస్తుంది, ఇది సౌకర్యవంతమైంది... సకాలంలో ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తుంది. 

చెన్నై- హజ్రత్ నిజాముద్దీన్ మధ్య నడిచే గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ భారతదేశంలో అత్యంత దూరం దూరం నడిచే రైలుగా రికార్డు సృష్టించింది. చెన్నై మరియు ఢిల్లీ మధ్య 2,075 కి.మీ దూరాన్ని ఈ రైలు 28 గంటల 30 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. ఈ మార్గం టిక్కెట్ ధర ₹1,500.

 రాజధాని ఎక్స్‌ప్రెస్ అదే దూరాన్ని 28 గంటల 15 నిమిషాల్లో పూర్తి చేస్తుంది, కానీ ఇందులో థర్డ్ ఏసీ టిక్కెట్ ధర ₹4,210. ఇది గరీబ్ రథ్ ధర కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ.

కిలోమీటరుకు 68 పైసల వరకు తక్కువ ధరతో, సౌకర్యం, సౌఖ్యంలో రాజీ పడకుండా చౌకైన ఏసీ ప్రయాణాన్ని కోరుకునే వారికి గరీబ్ రథ్ ఒక అనువైన ఎంపిక.

 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Fake Universities : ఈ విద్యాసంస్థల్లో చేరారో అంతే సంగతి.. ఆంధ్ర ప్రదేశ్ లో ఫేక్ యూనివర్సిటీల కలకలం
Recommended image2
Love Marriage: లేచిపోయి పెళ్లి చేసుకునేవాళ్లకు షాక్.. ఇకపై పేరెంట్స్‌కు చెప్పకుండా పెళ్లి కుదరదు
Recommended image3
గ్రామాల రూపురేఖలే మారిపోతున్నాయి.. రూరల్ ఎకానమీ దిశగా కీలక ముందుడుగు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved