భర్తతో తన చెల్లికి వివాహేతర సంబంధం ఉందనే అనుమానం.. ఆ భార్య ఏం చేసిందంటే..
ఒక మహిళా తన చెల్లి.. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించింది. ఈ క్రమంలోనే దారుణానికి యత్నించింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

ఒక మహిళా తన చెల్లి.. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించింది. ఈ క్రమంలోనే దారుణానికి యత్నించింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.
వివరాలు.. ఈశాన్య ఢిల్లీలోని శాస్త్రి పార్క్లోని బులంద్ మసీదు ప్రాంతంలో అక్కాచెల్లెల్లు సోను, సుమైల నివసిస్తున్నారు. అయితే తన చెల్లెలు సుమైల తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని సోను అనుమానించింది.
ఈ క్రమంలోనే సుమైలను అడ్డు తొలగించుకోవాలని సోను భావించింది. దీంతో కంట్రీ మేడ్ పిస్టల్తో సుమైలను కాల్చి చంపేందుకు ప్రయత్నించింది. అయితే తుపాకీ నుంచి వచ్చిన పెల్లెట్స్ సుమైల ముఖానికి తగిలాయి. దీంతో సుమైల తలపై తుపాకీతోనే చాలాసార్లు కొట్టింది.
అయితే ఈ దాడి నుంచి గాయాలతో బయటపడిన సుమైల.. పోలీసులను ఆశ్రయించింది. తన అక్క సోను బుధవారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో కంట్రీ మేడ్ పిస్టల్తో కాల్చి చంపేందుకు ప్రయత్నించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఈశాన్య) జాయ్ టిర్కీ తెలిపారు. ఈ ఘటనలో బాధితురాలికి స్వల్ప గాయాలైనట్లు చెప్పారు.
తన చెల్లెలు సుమైల తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని సోనూ అనుమానించిందని డీసీపీ తెలిపారు. ఇక, శాస్త్రి పార్క్ పోలీస్ స్టేషన్లో ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), ఆయుధ చట్టంలోని సెక్షన్ 307 (హత్య ప్రయత్నం) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సోనూను అరెస్టు చేశామని, తదుపరి విచారణ జరుపుతున్నామని చెప్పారు.