MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • అయోధ్య : రాముడి పాదాల దగ్గరవాడిన పూలతో సువాసనా భరితమైన అగరబత్తీలు..

అయోధ్య : రాముడి పాదాల దగ్గరవాడిన పూలతో సువాసనా భరితమైన అగరబత్తీలు..

దేశం నలుమూలల నుండి వచ్చిన భక్తులకు ఇదొక సువాసనాభరితమైన, శుభ అనుభవాన్ని ఇస్తుంది. ఇలా వచ్చినవారు శ్రీరామ జన్మభూమి ఆలయ వేడుకలో పాల్గొనవచ్చు. రాముడి ఆశీస్సులతో పాటు ఈ ప్రత్యేక అగర్ బత్తీలను కూడా ఇంటికి తీసుకుపోవచ్చు. 

3 Min read
Bukka Sumabala
Published : Jan 20 2024, 02:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

అయోధ్య : అయోధ్యలో మరో అద్భుత ప్రయోగానికి నాంది పడింది. బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి వాడే పువ్వులను రీ సైక్లింగ్ చేసి అగర్ బత్తీలు తయారుచేయనున్నారు.అయోధ్యలోని అన్ని ఆలయాలు, రాంలల్లా ఆలయంలో వాడే పూలను రీసైక్లింగ్ చేసి అగరబత్తీలు తయారు చేయనుంది అయోధ్య మునిసిపల్ కార్పొరేషన్. ఇప్పటికే కార్పొరేషన్ చొరవతో అయోధ్య ధామ్‌లోని అన్ని దేవాలయాలలో సమర్పించిన పువ్వులను ప్రాసెస్ చేయడం ద్వారా ధూప కర్రలను తయారు చేస్తున్నారు. 

29

మునిసిపల్ కార్పొరేషన్ అదే పద్ధతిలో ప్రాణ ప్రతిష్ట కోసం సమర్పించే పుష్పాలను ప్రాసెస్ చేయనుంది. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం, ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలోని పూలవ్యర్థాలతో అగరబత్తులను తయారు చేస్తారు, తద్వారా ఆలయం, దాని పరిసరాలు శుభ్రంగా ఉంచుతారు. ప్రాసెసింగ్ ద్వారా, స్వయం సహాయక సంఘాల మహిళలను కూడా ఉపాధి కల్పించవచ్చు. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత, అయోధ్య ధామ్‌లోని అన్ని దేవాలయాల నుండి ప్రతిరోజూ 9 మెట్రిక్ టన్నుల పూల వ్యర్థాలు రీసైకిల్ చేయబడతాయని అంచనా. అయితే, ప్రస్తుతం 2.3 మెట్రిక్ టన్నుల పూలు రీసైక్లింగ్ అవుతున్నాయి.

39

అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ విశాల్ సింగ్ దీని గురించి మాట్లాడుతూ.. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యకు ప్రతి సంవత్సరం అసంఖ్యాకమైన యాత్రికులు వస్తుంటారు. భక్తితో వారు సమర్పించే పూల వల్ల టన్నుల కొద్దీ పూల వ్యర్థాలు పోగవుతాయి. ఈ పూల వ్యర్థాలను సేకరించి సహజమైన అగరుబత్తీలుగా మారుస్తారు. దీంతో అయోధ్యలోని ఆలయ పుష్పాలకు కొత్త రూపం వస్తుంది. 

49

దేశం నలుమూలల నుండి వచ్చిన భక్తులకు ఇదొక సువాసనాభరితమైన, శుభ అనుభవాన్ని ఇస్తుంది. ఇలా వచ్చినవారు శ్రీరామ జన్మభూమి ఆలయ వేడుకలో పాల్గొనవచ్చు. రాముడి ఆశీస్సులతో పాటు ఈ ప్రత్యేక అగర్ బత్తీలను కూడా ఇంటికి తీసుకుపోవచ్చు. ప్రాణ ప్రతిష్ఠ అనే చారిత్రాత్మక కార్యక్రమం తర్వాత, ఈ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని తెలిపారు. ఎందుకంటే జనవరి 22 తరువాత ప్రతిరోజూ 22 లక్షల మంది భక్తులు అయోధ్య ధామానికి వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. 

59

పూల సేకరణ, రీసైక్లింగ్ కోసం అవగాహన ఒప్పందం
అక్టోబర్ 21, 2023న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలోని దేవాలయాల్లో సమర్పించే పూలతో తయారు చేసిన వెదురు లేని ధూపాన్ని ప్రారంభించారని ADA వైస్ ప్రెసిడెంట్ OSD వినీత్ పాఠక్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్, నమామి గంగే కార్యక్రమం మద్దతు, మార్గదర్శకత్వం వల్ల ఈ ప్రాజెక్ట్ సాధ్యమైందని ఆయన అన్నారు. ఇందుకోసం పూల వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్ కోసం అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్‌తో ఎంఓయూ కుదుర్చుకున్న ఫూల్ అనే సంస్థకు బాధ్యతలు అప్పగించారు. 

69

సున్నితమైన గంధపు తైలం సువాసనతో కూడిన ఈ ధూపం రామజన్మభూమి దీవెనలను ప్రపంచమంతటా తీసుకువెళుతోందని ఆయన అన్నారు. లక్షలాది మంది భారతీయుల రోజువారీ పూజ ఆచారాల కోసం వీటిని పొందడం కోసం Q-Com ప్లాట్‌ఫారమ్, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపై ఫూల్ ఉత్పత్తులు ప్రారంభించబడ్డాయి.

79

ప్రాణ ప్రతిష్ట తర్వాత దీన్ని మరింత విస్తరించనున్నారు. ప్రస్తుతం, ప్రాణ ప్రతిష్ఠకు ముందు అయోధ్య ధామ్ నుండి ప్రతిరోజూ 2.3 మెట్రిక్ టన్నుల వ్యర్థ పుష్పాలను రీసైకిల్ చేస్తున్నారు. 20 మంది మహిళలు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని రానున్న రోజుల్లో భక్తుల రద్దీ పెరగనున్న దృష్ట్యా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను నిర్ణయించినట్లు వినీత్ పాఠక్ తెలిపారు. దీని కింద రోజుకు 9 మెట్రిక్ టన్నుల పూల వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడంతోపాటు 275 మంది మహిళలకు ఉపాధి లభిస్తుంది. 

89

ఇది మాత్రమే కాదు, సందర్శకులు అగరబత్తిలను తయారు చేసే విధానాన్ని చూడటానికి, పద్ధతిని తెలుసుకోవడానికి, చేతితో తయారు చేసిన అగర్బత్తీలను ఇంటికి తీసుకెళ్లడం వంటి వాటికోసం కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తారు. దీంతోపాటు యాత్రికుల సంఖ్య పెరగడంతో, మరిన్ని పుష్పాలను రీసైకిల్ చేయడానికి ఒక పెద్ద ప్లాంట్ కూడా ఏర్పాటు చేయబడుతుంది.

99

ఏ దేవాలయాల నుంచి పూలను సేకరిస్తున్నారంటే..
హనుమాన్ గర్హి
కనక్ భవన్
నాగేశ్వర్ నాథ్ ఆలయం
శ్రీ కాలే రామ్ ఆలయం
గోరే రామ మందిరం
పెద్ద దేవకాలి ఆలయం
చిన్న దేవకాలి ఆలయం
స్వామినారాయణ ఆలయం, కనక్ భవన్ ఆలయం
జనవరి 22 నుండి ప్రభు శ్రీ రామ జన్మభూమి ఆలయం నుండి పూల సేకరణ ఉంటుంది. 

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu
Recommended image2
Now Playing
PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
Recommended image3
Now Playing
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved