MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • కుర్రంలో ప్రయాణీకుల వాహనాలపై ఉగ్ర‌వాదుల‌ కాల్పులు.. 38 మంది మృతి

కుర్రంలో ప్రయాణీకుల వాహనాలపై ఉగ్ర‌వాదుల‌ కాల్పులు.. 38 మంది మృతి

Kurram : కుర్రంలో ప్రయాణికుల వాహనాలపై ముష్కరులు జరిపిన కాల్పుల్లో 38 మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు. మర‌ణాలు మ‌రింత పెరిగే అవ‌కాశ‌ముంది.  

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 21 2024, 06:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
don't cross, police, Stop

don't cross, police, Stop

Kurram open fire : పాకిస్తాన్ లో ఉగ్ర‌వాదులు మ‌రోసారి  మార‌ణ‌హోమం జ‌రిపారు. ప్ర‌యాణికుల‌తో కూడిన వాహ‌నం పై కాల్పులు జ‌ర‌ప‌డంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం అందుతున్న  రిపోర్టులు ప్ర‌కారం ఈ సంఖ్య మ‌రింత పెర‌గ‌నుంది. 

వివ‌రాల్లోకెళ్తే.. వాయువ్య పాకిస్థాన్‌లోని కుర్రం గిరిజన జిల్లాలో గురువారం ప్రయాణికుల వాహనాలపై ముష్కరులు కాల్పులు జరపడంతో దాదాపు 38 మంది మరణించారు. మ‌రో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతున్న వారిలో చాలా మంది ప్రాణాలు నిలుపుకోవడానికి పోరాడుతున్నారు. దీంతో మ‌ర‌ణాలు సంఖ్య పెర‌గ‌వ‌చ్చు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

మీడియా నివేదిక‌ల ప్ర‌కారం.. ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్ ప్రధాన కార్యదర్శి నదీమ్ అస్లాం చౌదరి మాట్లాడుతూ.. పెషావర్-పరాచినార్ మధ్య ప్రయాణిస్తున్న రెండు ప్యాసింజర్ వాహనాల కాన్వాయ్‌లను లక్ష్యంగా చేసుకుని ఉగ్ర‌వాదులు దాడి జ‌రిపారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఈ దాడిని ఆయ‌న పెద్ద విషాదంగా పేర్కొన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. 

33

ఈ ప్రాంతం చాలా కాలంగా షియా, సున్నీ ముస్లింల మధ్య సెక్టారియన్ ఉద్రిక్తతలకు హాట్‌స్పాట్‌గా ఉంది. ప్రధానంగా దీర్ఘకాల భూవివాదం కార‌ణంగా ఇది ఉద్భవించింది. దాడి చేసిన వారిని ఇంకా గుర్తించలేదు. అలాగే, దాడికి బాధ్యులను ఏ సమూహం ప్రకటించలేదు. 

పెషావర్ నుండి పరాచినార్ వరకు కాన్వాయ్‌లో ప్రయాణిస్తున్న వారిలో అతని బంధువులు ఉన్నారని స్థానిక నివాసి జియారత్ హుస్సేన్ ధృవీకరించార‌ని రాయిటర్స్ నివేదిక‌లు పేర్కొన్నాయి. అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ఈ దాడిని ఖండించారు. పౌరులను లక్ష్యంగా చేసుకున్న హింసను తీవ్రంగా ఖండించారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
పాకిస్తాన్

Latest Videos
Recommended Stories
Recommended image1
Indian Railways: జూలై 1 నుంచి రైల్వే కొత్త రూల్స్.. ఈ ఆ పనులు చేస్తే రూ.10 వేల వరకు జరిమానా, జైలు శిక్ష కూడా !
Recommended image2
Traffic Jam to Crores: ట్రాఫిక్ జామ్‌లో రూ. 2.9 కోట్ల బిజినెస్.. యువకుడి మైండ్ బ్లోయింగ్ ఐడియా !
Recommended image3
Earth Facts: ఒక్క సెకండ్ లో భూమిపై ఏం జరుగుతుందో తెలుసా? ప్రపంచాన్ని షేక్ చేస్తున్న మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved