MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • తిన్న తర్వాత కొద్దిసేపు నడవడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..?

తిన్న తర్వాత కొద్దిసేపు నడవడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..?

తిన్న వెంటనే పడుకోవడమో, కూర్చోవడమో చేయకుండా కొన్ని అడుగులు నడవాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. భోజనం చేసిన తర్వాత కొద్ది సేపు నడిస్తే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.  

1 Min read
Mahesh Rajamoni
Published : Jan 24 2023, 03:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
walking

walking

మన దేశంలో డయాబెటీస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. డయాబెటిస్ ఒక తీవ్రమైన అనారోగ్య సమస్య. దీనికి సకాలంలో చికిత్స చేయించుకోలేకపోతే  హృదయ సంబంధ సమస్యలు, వేళ్లు, కాలిలోని నరాల నష్టం, మూత్రపిండాల రుగ్మతలు, కంటి సమస్యలు, పేలవమైన రక్త ప్రవాహం, పాదాలలో నరాలోని దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు ఈ డయాబెటీస్ గాయాల నుంచి తీవ్రమైన సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుంది. 

25
walking

walking

ఇకపోతే నడక మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎందుకంటే ఇది ఎన్నో అనారోగ్య సమస్యలు రాకుండా మనల్ని కాపాడుతుంది. మరెన్నో సమస్యలు నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది. అందుకే రోజూ తప్పకుండా నడవాలని నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన తర్వాత కాసేపు నడవడం వల్ల  జీర్ణక్రియ బాగా పనిచేస్తుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. తిన్న తర్వాత 15 నిమిషాలు నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఇది టైప్ 2 డయాబెటిస్ వంటి సమస్యలను నివారించడానికి కూడా సహాయపడుతుంది.

35

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి నడక ఎలా సహాయపడుతుందో తెలుసుకునేందుకు ఏడు అధ్యయనాల ఫలితాలను పరిశోధకులు ఇటీవల పరిశీలించారు.స్పోర్ట్స్ మెడిసిన్ జర్నల్ లో ఇటీవల ప్రచురితమైన మెటా అనాలిసిస్ లో ఈ పరిశోధనలు ప్రచురితమయ్యాయి. భోజనం తర్వాత రెండు నుంచి ఐదు నిమిషాలు తేలికపాటి నడక రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని అధ్యయనం కనుగొంది.
 

45
walking

walking

తిన్నతర్వాత  కొన్ని నిమిషాల పాటు నడిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గినట్టు పరిశోధకులు కనుగొన్నారు. అలాగే క్రమం తప్పకుండా ఏరోబిక్ కార్యకలాపాలలో పాల్గొనడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని పరిశోధకులు కనుగొన్నారు. దీనివల్ల ఇన్సులిన్ కు సున్నితత్వం పెరుగుతుంది.

55

నడక వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గడమే కాదు..  అలసట, కేలరీలు తగ్గుతాయి. అలాగే శరీరం శక్తి వంతంగా మారుతుంది. గుండె ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంటుంది. ఎముకలు బలంగా అవుతాయి. శరీరం

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved