MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Mysore Bonda: వామ్మో.. మైసూర్ బోండాలను తింటే ఇన్ని సమస్యలొస్తాయా..?

Mysore Bonda: వామ్మో.. మైసూర్ బోండాలను తింటే ఇన్ని సమస్యలొస్తాయా..?

Mysore Bonda: వేడి వేడి మైసూర్ బోండాలను తింటుంటే వచ్చే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది కదా.. దీని రుచి అమోఘం, అద్భుతం.. కానీ ఈ బోండాలు కొందరికి అస్సలు మంచివి కావు. వారు ఈ బోండాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకో తెలుసా..? 

2 Min read
Mahesh Rajamoni
Published : Mar 19 2022, 10:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
19

Mysore Bonda: వేడి వేడిగా మైసూర్ బోండాల్లో.. కాస్త పల్లీ చెట్నీ.. సాంబార్ వేసుకుని తింటుంటే వచ్చే ఆ మజానే వేరబ్బా.. అందులోనూ ఇవి రుచిలో ది బెస్ట్ అనిపించుకుంటాయి కూడా.  అందుకే చాలా మంది దోశ కంటే ఈ బోండాలనే ఎక్కువగా తింటూ ఉంటారు. ఇవి వేడిగా ఉన్నా.. చల్లగా ఉన్నా.. రుచిలో ఏమాత్రం తేడా ఉండదు. అందుకేనేమో చాలా మంది వీటిని తినడానికే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. 

29

అయితే చాలా మందికి ఒక అనుమానం ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచి చేస్తుందా? చెడు చేస్తుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతుంటాయి. వాస్తవానికి మైసూర్ బోండాలు రుచికే తప్ప మరే లాభం కలిగించవు. 

39

వీటిని తినడం వల్ల వచ్చే లాభాలు ఒక్క శాతం కూడా లేవు. పైగా వీటిని తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి.  ఎందుకంటే ఈ బోండాలను నూనెలో డీప్ ఫ్రై చేస్తారు.  వీటిని తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. 

49

బోండాలను మైదాపిండి, బియ్యపు పిండి లో పెరుగును మిక్స్ చేసి తయారుచేస్తారు. ముఖ్యంగా మైదా పిండిని మిక్స్ చేసి తయారుచేసే ఈ  ఫుడ్ అయినా సరే మన రక్తంలోని షుగర్ లెవెల్స్ ను అమాంతం పెంచేస్తాయి. అందుకే వీటిని డయాబెటిక్ పేషెంట్లు ఎట్టి పరిస్థితిలో తినకూడదు. 
 

59

హార్ట్ పేషెంట్లకలు కూడా ఈ బోండాలు అంత మంచివి కావు. వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండటమే వారి ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే బియ్యం పిండిలో ఉండే కార్బోహైడ్రేట్లు హార్ట్ పేషెంట్స్ కు హానీ కలిగిస్తాయి. ఇవి గుండె సమస్యలను మరింత పెంచుతాయి కూడా. 

69

అలాగే డీప్ ఫ్రై చేసిన ఏ ఆహార పదార్థం కూడా మన ఆరోగ్యానికి అంత మంచివి కావు. మురొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మైదాపిండిలో Bad cholesterol ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీని నిల్వలు మన బాడీలో పెరుగుతున్న కొద్దీ ఎన్నో రోగాలు అటాక్ చేస్తాయి. 
 

79

ఈ బోండాలతో బరువు కూడా పెరుగుతారు. అంతేకాదు ఇది మన శరీర వేడిని కూడా పెంచుతుంది. అలాగే ఇన్సులిన్ నిరోధకత కూడా తగ్గుతుంది. 
 

89

ముఖ్యంగా వీటిని రెగ్యులర్ గా తింటే హైబీపీ సమస్య కూడా వస్తుందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. కాబట్టి మైదా పిండితో చేసిన ఆహారాలను తినకపోవడమే మంచిది. 
 

99

మైసూర్ బోండాలను తరచుగా తింటుంటే పొట్ట రావడంతో పాటుగా పొట్టలో ఏదో బండరాయి ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. కాబట్టి ఇక నుంచి మైసూర్ బోండాలకు దూరంగా ఉండండి.. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
 
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved