చాయ్ తో ఈ ఆహారాలను తినడం మానేయండి? లేదంటే మీ పని అంతే..
మనలో చాలా మంది చాయ్ ని పక్కాగా తాగుతుంటారు. మితంగా తాగితే ఆరోగ్యానికి మంచే జరుగుతుంది. ఇదంతా బానే ఉన్నా.. చాయ్ తో పాటుగా కొన్ని ఆహారాలు అసలే తినకూడదు. తిన్నారో మీ పని అంతే .
మనలో చాలా మంది ఉదయం, సాయంత్రం వేళల్లో పక్కాగా టీని తాగుతుంటారు. టీ మన ఆహారపు అలవాట్లలో ఒక భాగమై పోయింది. చాలా మంది వేడి వేడి టీ తాగిన తర్వాతే పొద్దున పనులను మొదలు పెడతారు. ఇక ఆఫీసుల్లో పనిచేసేవారైతే గంట గంటకు కూడా తాగుతుంటారు. టీని ఏ సమయంలోనైనా, ఎప్పుడైనా తాగొచ్చు. చాయ్ తో పాటుగా అందులో తినడానికి స్నాక్స్ కూడా పక్కాగా ఉండాల్సిందే. పకోడాల నుంచి సమోసాల వరకు ఎన్నో రుచికరమైన భారతీయ స్నాక్స్ ఒక కప్పు చాయ్ తో లాగిస్తుంటారు. కానీ టీతో మనం కొన్ని ఆహారాలను అసలే తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్య, ఆరోగ్య నిపుణుల సలహాల ప్రకారం వీటిని చాయ్ తో కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలతో ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఏమేం తినకూడదంటే..
ఆకుపచ్చ కూరగాయలు
ఆకుపచ్చ కూరగాయల్లో ఇనుము ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కానీ ఆకుకూరలు, ఇతర ఆకు కూరలను చాయ్ తో తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే టీలో టానిన్లు, ఆక్సలేట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఇనుము శోషణను నిరోధిస్తాయి. అందుకే శరీరం ఆకుపచ్చ కూరగాయల నుంచి ఇనుము కంటెంట్ ను గ్రహించలేకపోతుంది. అంతేకాదు పోషకాలు పుష్కలంగా ఉండే గింజలను కూడా టీతో తీసుకోకూడదు.
ఫ్రూట్ సలాడ్
చాయ్ వేడిగా ఉంటుంది. ఇది లోపలి నుంచి మన శరీరాన్ని వేడెక్కిస్తుంది. అందుకే చాయ్ తో పాటుగా చల్లని, పచ్చి ఆహారాలను తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు. అందుకే మీరు తాజా పండ్లు, ఫ్రూట్ సలాడ్ లేదా ఫ్రూట్ క్రీమ్ వంటి ఏదైనా పండ్ల ఆధారిత డెజర్ట్ లను తినకపోవడమే ఆరోగ్యానికి మంచిది. లేదా టీ పూర్తిగా తాగిన తర్వాతే ఫ్రూట్ సలాడ్ ను తీసుకోండి.
నిమ్మరసం
నిమ్మరసాన్ని బరువు తగ్గడానికి, ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవడానికి ఉపయోగిస్తారు. ముఖ్యంగా నిమ్మరసాన్ని తరచుగా బ్లాక్ టీకి కలుపుతుంటారు. అయితే నిమ్మరసం ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది.ఈ రెండింటి కాంబినేషన్ ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అంటే బ్లాక్ టీకి నిమ్మరసాన్ని కలపడం వల్ల పానీయంలో ఆమ్ల స్థాయిలు పెరుగుతాయి. దీంతో కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. తరచుగా యాసిడ్ రిఫ్లక్స్ తో బాధపడేవారు చాయ్ కు నిమ్మరసం జోడించకపోవడమే ఉత్తమం.
పసుపు
హల్దీ లేదా పసుపును భారతీయ వంటకాల్లో ఖచ్చితంగా ఉపయోగిస్తారు. నిజానికి పసుపులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. అయితే చాలా మంది చాయ్ లో కూడా పసుపును కలుపుతుంటారు. లేదా పసుపు అధికంగా ఉండే ఆహార పదార్థాలను టీతో పాటుగా తీసుకుంటారు. కానీ ఇది శరీరానికి హానికరం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే పసుపులో కర్కుమిన్ ఉంటుంది. టీ లో టానిన్ ఉంటుంది. ఈ రెండింటి కలయిక అసిడిటీ లేదా మలబద్దకం వంటి గ్యాస్ట్రిక్ సమస్యలను కలిగిస్తుంది.
curd
పెరుగు
పెరుగులో చలువ చేసే గుణాలుంటాయి. అయితే పెరుగును టీ తో పాటుగా అస్సలు తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే టీ వేడి పానీయం. ఈ టీ తో పాటుగా పెరుగు లేదా మరేదైనా శీతల ఆహారాలను తీసుకోవడం అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు టీ తాగేటప్పుడు వీటిని మాత్రం తీసుకోకండి. అప్పుడే మీరు జీర్ణ సమస్యలను దూరంగా ఉంటారు.