- Home
- Jobs
- india post: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 21,413 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, పరీక్ష లేదు ఇంటర్వ్యూ లేదు !
india post: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 21,413 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, పరీక్ష లేదు ఇంటర్వ్యూ లేదు !
India POST GDS Recruitment 2025: భారత తపాలా శాఖలో 21413 పోస్టుల నియామకాలు కోసం నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు మార్చి 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు మీకోసం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
India POST GDS Recruitment 2025: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ! అలాగే, మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే ఇప్పుడు మీ ముందుకు ఒక సువర్ణావకాశం వచ్చింది. మీరు ఎటువంటి పరీక్ష లేకుండా, ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా ప్రభుత్వ ఉద్యోగం పొందవచ్చు.
ఈ నోటిఫికేషన్ ప్రత్యేకత అది మాత్రేమే కాదు ఒకటి లేదా రెండు ఖాళీలు కాకుండా ఏకంగా 21 వేలకు పైగా పోస్టులు ఉన్నాయి. భారత తపాలా శాఖలో 21413 పోస్టుల నియామకాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 3గా ఉంది. 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇండియా పోస్ట్ GDS ఖాళీలు 2025
ఇండియా పోస్ట్ అంటే ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ మొత్తం 21413 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టులకు ఉద్యోగాలను విడుదల చేసింది. దీని కోసం మీరు ఎటువంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఇవ్వనవసరం లేదు, అయితే ఈ పోస్టులకు ఎంపిక మెరిట్ ఆధారంగా ఉంటుంది. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ నియామకం 10వ తరగతి పాస్ అయితే చాలు.
మీరు ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను indiapostgdsonline.gov.in లో తెలుసుకోవచ్చు. ఇక్కడ నుండి ఆన్లైన్ దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 3. కాబట్టి చివరి తేదీ కోసం చూడకుండా.. వెంటనే దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.100గా నిర్ణయించగా, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు ఎటువంటి రుసుము లేదు.
India POST GDS రిక్రూట్మెంట్ వయోపరిమితి ఎంత?
ఇండియా పోస్ట్ GDS రిక్రూట్మెంట్ కోసం వయోపరిమితిని కూడా నిర్ణయించింది. దీని కింద, దరఖాస్తు చేసుకోవడానికి కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. గరిష్టంగా 40 సంవత్సరాలు మించకూడదు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
ఇండియా పోస్ట్ GDS రిక్రూట్మెంట్: ఎవరికి ఎన్ని ఖాళీలు ఉన్నాయి?
ఇండియా పోస్ట్లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల కోసం నియామకాలు వెలువడ్డాయి. ఉత్తరప్రదేశ్ సర్కిల్లో 3004 పోస్టులకు ఉద్యోగ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. మధ్యప్రదేశ్లో మొత్తం 1314 ఖాళీలు ఉన్నాయి. బీహార్లో 783 ఖాళీలు, ఛత్తీస్గఢ్లో 638 ఖాళీలు ఉన్నాయి. ఇది కాకుండా, ఇతర రాష్ట్రాల్లో కూడా ఖాళీలు ఉన్నాయి. తెలంగాణలో 519 పోస్టులు ఉన్నాయి.
ఇండియా జిడిఎస్ ఉద్యోగాలకు జీతం ఎంత?
ఇండియా పోస్ట్లో వెలువడిన నియామకాల్లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, పోస్టల్ సర్వెంట్ల పోస్టుల ఖాళీలు ఉన్నాయి. నోటిఫికేషన్లో ఇచ్చిన సమాచారం ప్రకారం, బ్రాంచ్ పోస్ట్మాస్టర్ పోస్టుకు జీతం రూ. 12000 నుండి రూ. 29380 వరకు ఉంటుంది, అయితే బ్రాంచ్ పోస్ట్మాస్టర్, పోస్టల్ సర్వెంట్లకు వేతన శ్రేణి రూ. 10000 నుండి రూ. 24470 వరకు ఉంటుంది. ఇది కాకుండా, ఉద్యోగులకు ప్రాథమిక వేతనంతో పాటు డీఏ కూడా లభిస్తుంది. అలాగే, వార్షికంగా 3% ఇంక్రిమెంట్ కూడా ఇస్తారు.