అమానుషం : పగతో మనుషుల్ని చంపి తిన్నారు.. తినాల్సిన పందుల్ని వదిలేశారు..!
చరిత్ర చాలాసార్లు షాక్ కు గురి చేస్తుంది. తవ్విన కొద్దీ బయటపడే నిజాలు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తాయి. అలాంటి ఓ అసాధారణ, భయానక విషయం ఇటీవల మెక్సికోలో బయటపడింది. మెక్సికో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంథ్రపాలజీ అండ్ హిస్టరీ ప్రచురించిన ఓ నివేదికలోని నిజాలు పగటిపూట కూడా వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్నాయి.
చరిత్ర చాలాసార్లు షాక్ కు గురి చేస్తుంది. తవ్విన కొద్దీ బయటపడే నిజాలు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తాయి. అలాంటి ఓ అసాధారణ, భయానక విషయం ఇటీవల మెక్సికోలో బయటపడింది. మెక్సికో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంథ్రపాలజీ అండ్ హిస్టరీ ప్రచురించిన ఓ నివేదికలోని నిజాలు పగటిపూట కూడా వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్నాయి.
ఇంతకీ విషయం ఏంటంటే.. మనిషిని మనిషే చంపి తిన్నాడు. వాళ్లకు తినడానికి లేక కాదు. పగ, కోపం, ప్రతీకారం లాంటి వాటితో.. తమతో ఉన్న పందుల్ని వదిలేసి శత్రువుల్ని చంపి తిన్నారు. వింటుంటేనే కడుపులో దేవి నట్టుగా ఉన్న ఈ సంఘటన 1500 సంవత్సర కాలంలో జరిగింది.
1500 ప్రాంతంలో ఓ స్పానిష్ విజేత తన సైన్యంతో కలిసి, తాను బంధించిన గుంపులోని పలువురు మహిళలు, పిల్లల్ని దారుణంగా చంపి తిన్నాడని నివేదిక వెల్లడించింది. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే వీరు మనుషుల్ని తిని, పందుల్ని వదిలేశారు.
మెక్సికో లోని టెకోయాక్ పట్టణంలో జరిపిన తవ్వకాల్లో ఈ భయానక సంఘటన గురించిన నిజాలు బయటపడ్డాయి. అక్కడ ‘వారు.. వారిని తిన్న స్థలం ఇదే’ అని అజ్టెక్ నాహుఔట్ భాషలో ఉందని నివేదిక తెలిపింది.
1520 లో టెకోయిక్ నివాసితులు స్వదేశీ సమూహాల నుంచి సుమారు 350 మంది ప్రజలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనను ‘జుల్టెపెక్’ అని కూడా పిలుస్తారు. ఇలా బంధించిన వారిలో 15 మంది పురుషులు, 50 మంది మహిళలు, 10 మంది పిల్లలు, 45 మంది సైనికులు ఉన్నారు. వీరంతా ఆఫ్రికన్, స్వదేశీ సంతతికి చెందిన క్యూబన్లు అని నివేదిక వెల్లడించింది.
వీరిని బంధించిన తరువాత.. ఆ విషయాన్ని సైనికులు విజేత హెర్నాన్ కోర్టెస్కు సమాచారం అందించారు. అతను వారిని చంపి, పట్టణాన్ని నాశనం చేయాలని ఆదేశించాడు. దాంతో అతడి సైన్యం రెచ్చిపోయింది. కొద్ది నెలల వ్యవధిలో వీరందరిని చంపి, 1521 ప్రారంభంలో పట్టణాన్ని నాశనం చేసినట్లు నివేదిక వెల్లడించింది.
ఇక్కడ తవ్వకాలు జరిపిన పురావస్తు శాస్త్రవేత్త ఎన్రిక్ మార్టినెజ్ వర్గాస్ మాట్లాడుతూ.. ‘‘ప్రతీకార చర్యలో భాగంగా ఈ దాడి జరిగి ఉంటుంది.
ఈ ఘటనలో ప్రాణ త్యాగం చేసిన వారి ఎముకలను, ఇతర సాక్ష్యాలను నీళ్లు లేని బావుల్లోకి విసిరినట్లు త్రవ్వకాలు వెల్లడించాయి. ఇక్కడ ప్రజలు దాడిని ఆపడానికి ప్రయత్నించారు. కానీ విఫలమయినట్లు తెలుస్తోంది’’ అన్నారు.
ఆయన మాట్లాడుతూ.. "దాడి సమయంలో నగరంలో ఉన్న యోధులు కొందరు పారిపోగలిగారు. కానీ మహిళలు, పిల్లలు తప్పించుకోలేకపోయారు. దాంతో వారే ప్రధాన బాధితులయ్యారు. తవ్వకాల్లో చిన్న పిల్లల ఎముకలు, యుక్త వయసు ఆడవారితో పాటు పడి ఉన్నట్లు గుర్తించాం’ అన్నారు.
ఖననం చేసిన స్థలాన్ని పరిశీలిస్తే.. ‘తప్పించుకుని పారిపోతున్నారని చెప్పి.. ప్రజల్ని దొరకపుచ్చుకుని ఊచకోత కోసినట్లు.. తొందరపాటులో ఖననం చేసినట్లు తెలుస్తుంది’ అన్నారు. అంతేకాక ‘‘అనేక దేవాలయాలు కాలిపోయాయి.. విగ్రహాలు తలలు ఖండించారు. పట్టుబడిన కొంతమంది మహిళల తలలు, పుర్రె రాక్లో వేలాడదీశారు. దొరికిన అవశేషాలను బట్టి ఇందులో ఓ మహిళ గర్భవతి అని తెలిసింది. అన్నారు.
‘ఇలా బంధించిన ప్రజలను ఖైదీలుగా ఉంచి.. ఆరు నెలలకు పైగా ఆహారం ఇచ్చారు. ఆ తర్వాత గుర్రాలు, పురుషులు, స్త్రీలను చంపి తిన్నారు. అయితే స్పానిష్ ప్రజలు తమతో పాటు ఆహారం కోసం పందులను తీసుకువచ్చారు. కానీ వాటిని తినలేదని తవ్వకాల ద్వారా తెలిసింది’’ అన్నారు.