హైపర్ గాడికి డైపర్ వేయాల్సిన టైమొచ్చింది.. `జబర్దస్త్` కమెడియన్పై వైసీపీ యువనేత పేరిట పోస్ట్.. హాట్ టాపిక్
`జబర్దస్త్` కమెడియన్ హైపర్ ఆది ఇటీవల వైసీపీ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వైసీపీ నేతలు, అభిమానులు ఆయన్ని ఆడుకుంటున్నారు. ఆదిని ట్రోల్ చేస్తున్నారు.
`బజర్దస్త్`లో టాప్ కమెడియన్గా ఉన్న హైపర్ ఆది పవన్ కళ్యాణ్కి దగ్గరవుతున్నాడు. ఆ మధ్య పవన్తో క్లోజ్ గా ఉన్న ఫోటోలను షేర్ చేశారు. మరోవైపు `హరిహరవీరమల్లు` చిత్రానికి డైలాగుల విషయంలో సహకారం అందిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇక శ్రీకాకుళంలో జనసేన నిర్వహించిన `యువశక్తి` సభలో పాల్గొని వైసీపీ నాయకులకు చురకలు అంటించారు. తనదైన పంచ్ డైలాగ్లో తెచ్చిపోయాడు. తన పంచ్లకు కొన్ని బూతులు జోడించి వైసీపీ మంత్రులపై, నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆది కామెంట్లు వైరల్ అయ్యాయి. దీనిరోజా కూడా కౌంటర్లిచ్చింది.
ఈ నేపథ్యంలో తాజాగా ఆదిని కౌంటర్ చేస్తున్నారు వైసీపీ నేతలు. వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా టీమ్ హైపర్ ఆదిని ఓ ఆట ఆడుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆర్మీ పేరిట ఉన్న ఓ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఆదిని టార్గెట్ చేస్తుంది. ఇందులో ఆదిని పద్ధతిగా పలకరించే టైమ్ వచ్చిందంటూ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. అంతేకాదు ఇందులో ఆది ఫోన్ నెంబర్ కూడా ఉండటం విశేషం.
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆర్మీ పేరుతో ఉన్న ఓ సోషల్ మీడియా అకౌంట్లో `హైపర్ ఆది గాడికి డైపర్ వేయాల్సిన టైమ్ వచ్చేసింది. ఇది వాడి ఫోన్ నెంబర్...... ఫేస్ బుక్లో వైరల్ చేసి పద్ధతిగా పలకరించండి` అని పోస్ట్ పెట్టారు. ఈ ఫేస్ బుక్ పోస్ట్ ని రోజా సెల్వమణితో ఉన్న మరో అకౌంట్ ద్వారా షేర్ చేశారు. దీంతో ఇప్పుడు ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ రచ్చ చేస్తుంది.
అయితే ఈ నెంబర్ కరెక్టేనా? కాదా? అనేది తెలియాల్సి ఉంది. కానీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అభిమానులు, ఆయన ఫాలోవర్స్ ఈ రచ్చ చేయడంలో రాజకీయంగా ఇది హాట్ టాపిక్ గా మారుతుంది. ఇటీవల కాలంలో బైరెడ్డి వైసీపీలో చాలా యాక్టీవ్గా ఉన్నారు. తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.మరి ఆయన తన ఆర్మీతో ఆదిని ఏం చేస్తున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. మొత్తానికి పెద్ద రచ్చే చేస్తున్నారని, ఆదికి చుక్కలు చూపిస్తున్నారని అర్థమవుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇక `యువశక్తి` సభలో హైపర్ ఆది ఏం అన్నాడనేది చూస్తే, పవన్ ఓడిపోయాడంటున్నారు, ఓడిపోతేనే ఇంత మంది కష్టాలను తీర్చాడంటే, గెలిస్తే వాళ్ళ కష్టం కాంపౌండ్ వాల్ని కూడా దాటనివ్వరు. ఆయనది ఆస్తులు కూడబెట్టుకునే మనస్థత్వం కాదు, అలాంటి వ్యక్తి గురించి ప్రెస్ మీట్లు పెట్టి బూతులు తిడతారా? మీకు ఆశాఖ ఈ శాఖ అని పేర్లు ఎందుకు? పవన్ కళ్యాణ్ని తిట్టే శాఖ పెట్టుకోండి. మీ శాఖ గురించి ఓ పది నిమిషాలు మాట్లాడమంటే.. పది సెకన్లు కంటే ఎక్కువ మాట్లాడలేరంటూ విమర్శలు గుప్పించారు.
అంతటితో ఆగలేదు, మీరు ఏ నోటితో అయితే దత్త పుత్రుడు అని అంటున్నారో.. అదే నోటితో అంజనీ పుత్రుడు అని అనిపించుకోలేకపోతే చూడండి. ప్రపంచంలో ప్రతి ఒక్కడూ.. పవన్ కళ్యాణ్ని ఒక్క మాట అనేసి పాపులర్ అయిపోదాం అనుకునే వాళ్లే, మీ పాపులారిటీ కోసం ఆయన పర్సనాలిటీని దెబ్బ తీసేట్టు మాట్లాడారా? ఈసారి జనసేన కొట్టే దెబ్బకి మీ అబ్బ గుర్తొస్తాడు చూస్కోండి’ అంటూ రెచ్చిపోయాడు.
అయితే దీనికి మంత్రి రోజా కౌంటరిచ్చింది. వాళ్లు మాట్లాడుతున్నారంటే వాళ్లని ఎవరు మాట్లాడిస్తున్నారో మనం ఆలోచించాలి కానీ వాళ్లని తిరిగి తిట్టడం వేస్ట్ అని, వాళ్లేదో చిన్న చిన్న షోలు చేసుకునేవాళ్లు. మెగా ఫ్యామిలీలో ఎక్కువ మంది హీరోలు ఉన్నారు కాబట్టి వాళ్లకి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్లకి ఇండస్ట్రీలో ఉండకుండా చేస్తారని అలా మాట్లాడతారు కానీ నిజమైన ప్రేమతో కాదని కౌంటరిచ్చింది రోజా. మంత్రులకు శాఖలే తెలియదు అని అంటున్నాడు, శాఖలు తెలియకుండా మంత్రులు అవుతారా? ఏమీ తెలియని వాళ్ళని ప్రజలు ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడే కూర్చోబెట్టారు. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. వాళ్లు పొలిటికల్ అజ్ఞానులు. పొలిటికల్ జోకర్స్ మాట్లాడే మాటల్ని మనం పట్టించుకోకూడదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది రోజా.