పెళ్లే కాదు లవ్ స్టోరీ చెప్పీ షాకిచ్చిన యామీ గౌతమ్.. అలా పడిపోయారట!
`ఫెయిర్ అండ్ లవ్లీ` బేబీ యామీ గౌతమ్ ఇటీవల సడెన్గా పెళ్లి చేసుకుని షాకిచ్చింది. ఇప్పుడు సడెన్గా తన లవ్ స్టోరీ చెప్పీ మరింత షాకిచ్చింది. ఏకంగా ప్రమోషన్లో పడిపోయామని చెప్పి ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
`గౌరవం`, `కొరియర్ బాయ్ కళ్యాణ్` చిత్రాలతో తెలుగులో ఆకట్టుకున్న యామీ గౌతమ్ ఇటీవల సెకండ్ వేవ్ లాక్డౌన్ సమయంలో సీక్రెట్గా మ్యారేజ్ చేసుకుంది. `ఉరి` సినిమా దర్శకుడి ఆదిత్య ధార్ని వివాహం చేసుకుంది. ఈ సినిమాకిగానూ ఆయన జాతీయ అవార్డుని అందుకున్న విషయం తెలిసిందే.
అయితే వీరిద్దరు ఎప్పుడు ప్రేమలో పడ్డారు, ఎలా ప్రేమించుకున్నారనేది బాలీవుడ్ వర్గాలకు కూడా మిస్టరీగా ఉండింది. అయితే పెళ్లి తర్వాత కూడా దీనిపై నోరు విప్పని ఈ జంట తాజాగా ఉన్నట్టుండి లవ్ స్టోరీని రివీల్ చేశారు. యామీ గౌతమ్ తమ ప్రేమ ఎలా మొదలైంది చెప్పి సర్ ప్రైజ్ చేసింది.
`ఉరి` సినిమా ప్రమోషన్లో తామిద్దరం పడిపోయామని తెలిపింది యామీ గౌతమ్. `ఉరి` సినిమా టైమ్లో తమిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందట. సినిమా ప్రమోషనల్ సమయంలో తమ స్నేహం మరింత బలపడిందని, స్నేహం కాస్త ప్రేమగా మారిందని చెప్పింది.
`ఆదిత్యతో పరిచయం ఏర్పడకముందే అతనంటే నాకు గౌరవం ఉండేది. ఇతరుల పట్ల ఆయన మర్యాదగా వ్యవహరిస్తాడు. దర్శకుడిగా ఎంత ఒత్తిడిలో ఉన్నా ఎదుటి వారిని గౌరవిస్తారు. పని చేసే చోట అతని మంచి వాతావరణాన్ని సృష్టిస్తాడు. ఆదిత్య చాలా మంచి వాడని అందరు చెబుతుంటే విన్నా. అతనితో పరిచయం ఏర్పడ్డాక అది నిజమేనని తెలుసుకున్నా. మా మధ్య పరస్పర గౌరవం ఉంది. నా దృష్టిలో మంచి గుణం, అర్థం చేసుకునే హృదయం ఉండమే అసలైన ప్రేమ` అని తెలిపింది యామీ.
ఇంకా చెబుతూ, `ప్రేమ గురించి ఇండస్ట్రీలోని కొంతమంది స్నేహితులకు ముందే తెలుసు. కానీ వారు ఎక్కడా తమ గురించి చెప్పకుండా, ప్రైవసీ ఇచ్చారు` అని తెలిపింది.
సీక్రెట్ మ్యారేజ్ పై స్పందిస్తూ, `హంగులు, ఆర్భాటాలలో పెళ్లి చేసుకోవడం ఇద్దరికి ఇష్టం లేదు. కోవిడ్ కారణంగా కుటుంబ సభ్యులు, కొంతమంది స్నేహితుల సమక్షంలోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. చాలా మంది స్నేహితులకు, సన్నిహితులకు పెళ్లి సమాచారం ఇవ్వలేకపోయాం. కానీ వారు పరిస్థితిని అర్థం చేసుకొని మాకు తోడుగా నిలిచార`ని చెప్పింది.
`ఫెయిర్ అండ్ లవ్లీ` యాడ్తో మోడల్గా బాగా పాపులర్ అయిన యామీ `ఉల్లాస ఉత్సాహ` అనే కన్నడ చిత్రంతో నటిగా కెరీర్ని ప్రారంభించింది. బాలీవుడ్లో చేసిన `విక్కీ డోనర్`తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో `నువ్విలా`, `గౌరవం`, `యుద్ధం`, నితిన్ సరసన'కొరియర్ బాయ్ కల్యాణ్`లో నటించింది. వీటితో పాటు తమిళ, పంజాబీ, కన్నడ, మలయాళ చిత్రాల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకులను కూడా మెప్పించింది.
దర్శకుడు ఆదిత్య ధార్ `కాబుల్ ఎక్స్ప్రెస్` చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత `హాల్ ఏ దిల్`, `వన్ టూ త్రీ`, `డాడీ కూల్`, `ఆక్రోష్`, `తేజ్`చిత్రాలకు లిరిక్ రైటర్గా, డైలాగ్ రైటర్గా పనిచేశారు. `ఉరిః ది సర్జికల్ స్ట్రైక్` చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఆయన రూపొందించిన `ది ఇమ్మోరల్ ఆశ్వత్థామ` చిత్రం ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది.