ప్రభుదేవాతో బ్రేకప్కు కారణమదే.. సీక్రెట్ బయటపెట్టిన నయనతార
సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్గా ఓ వెలుగు వెలుగుతున్న అందాల భామ నయనతార. ఈ బ్యూటీ గతంలో ప్రభుదేవాతో సాగించిన ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. పెళ్లి వరకు వచ్చిన నయన్, ప్రభులు ఎందుకు బ్రేకప్ చెప్పేసుకున్నారో తెలుసా..?
2009 జూన్లో ప్రభుదేవా, నయనతారలు పెళ్లి చేసుకోబోతున్నట్టుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే
ఇక పెళ్లి చేసుకోవటమే తరువాయి అనుకుంటున్న తరుణంలో సడన్గా ఇద్దరు బ్రేకప్ చెప్పేసుకున్నారు. ఈ బ్రేకప్ గురించి నయన్ తరువాత మీడియాతో మాట్లాడింది.
`అది కేవలం నా రిలేషన్ షిప్ కాదు. ప్రేమలోనే కాదు పెళ్లి తరువాత కూడా ఇలా విడిపోవటం జరుగుతూనే ఉంటుంది. అభిప్రాయబేధాలన్ని రోజు రోజుకు పెరుగుతూ వస్తుంటాయి. మనం వాటిని భరించలేని స్థితి వచ్చినప్పుడు ఇక ఆ బంధం నుంచి తప్పుకోవటమే బెటర్. పరిస్థితులను బట్టి మనుషులు కూడా మారుతుంటారు` అంటూ వేదాంతం చెప్పింది.
అంతేకాదు రిలేషన్ షిప్లో ఉండగా నేను నా వైపు నుంచి వంద శాతం కరెక్ట్ గా ఉన్నాను అయినా అది వర్క్ అవుట్ కాకపోవటంతో ఆ రిలేషన్ వదులుకోవాల్సి వచ్చింది..అని తెలిపింది.
ప్రస్తుతం నయనతార విఘ్నేష్ శివన్తో రిలేషన్ షిప్లో ఉంది. చాలా కాలంగా డేటింగ్ చేస్తున్న ఈ ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది.
ఇద్దరు కలిసి వరుసగా విదేశీ టూర్లకు వెళుతున్న నయన్, విఘ్నేష్లు సోషల్ మీడియాలో తమ రొమాంటిక్ ఫోటోలను షేర్ చేస్తున్నారు.